చిప్స్ తేలేదని.. చీప్గా భర్తను పొడిచేసింది భయ్యా..! (వీడియో)
ఒకప్పుడు వివాహం అంటే రెండు మనసుల కలయిక, రెండు కుటుంబాల అనుబంధం, జీవితాంతం ప్రయాణానికి మొదటి అడుగు. కానీ, నేడు కొన్ని దారుణ సంఘటనలు ఈ పవిత్ర బంధంపైనే ప్రశ్నలు రేపుతున్నాయి. పెళ్లి పేరుతో మోసం, బెదిరింపులు, హత్యలు, కుట్రలు వంటివి వెలుగుచూస్తుంటే, విస్మయం కలుగుతోంది. చిన్న చిన్న కారణాలకే భర్తలను భార్యలు హతమారుస్తున్నారు.
తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. చిప్స్ తేలదని చెప్పి భర్తపై కత్తితో దాడి చేయబోయింది భార్య. కూతురు అడ్డుకుంటున్నా ఆమె ఆపకపోవడంతో, ఇంట్లో ఉన్న హింసాత్మక వాతావరణం అందరినీ ఆందోళనకు గురిచేసింది.

ఈ సంఘటనను చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కత్తితో దాడి చేయడం ఒక హింసాత్మక చర్య అని, దీనికి హత్యాయత్నం లేదా గృహ హింస కింద కఠినమైన శిక్షలు పడాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. అయితే, భారత న్యాయ వ్యవస్థలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని, అందుకే ఆమెకు శిక్ష పడకపోవచ్చని కొందరు విమర్శిస్తున్నారు.
She stabbed her husband just because he didn't bring the snacks she asked him to.
— ︎ ︎venom (@venom1s) July 23, 2025
No fear of law. His little daughter is trying to save the father.
Worst thing is, she won't get any punishment.
Even if he divorced her, she will get alimony.pic.twitter.com/xMeiuZZsBs
ఈ ఘటన చూసి పెళ్లి చేసుకోవడం భయంకరంగా ఉందని, భర్తను ఎప్పుడైనా చంపే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఇదే పని భర్త చేస్తే మీడియాలో భార్యను హింసించిన భర్త అని హెడ్లైన్స్ వస్తాయని విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications