భార్య శవంతో 10 కి.మీ: మారిన మాఝీ లైఫ్ స్టైల్, మరో వివాహం, బైక్ కొనుగోలు
భువనేశ్వర్: ఓ చిన్న ఘటన జీవితాన్ని మలుపు తిప్పుతోందని అంటుంటారు. నిజమే ఒడిశాకు చెందిన గిరిజనుడు ధనా మాఝీ జీవితాన్ని కూడ ఓ ఘటన మలుపు తిప్పింది. ఏడాది క్రితం వరకు ధనా మాఝీ జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే ఏడాది క్రితం తన భార్య శవాన్ని 10 కి.మీ. దూరం భుజాన మోసుకొచ్చిన ఘటన మాఝీ జీవితాన్ని మలుపు తిప్పింది.
ఒడిశాకు చెందిన ధన మాఝీ అనే వ్యక్తి భార్య గత ఏడాది అనారోగ్యంతో మరణించింది. ఆమె మరణించిన సమయంలో అంబులెన్స్ ఇవ్వకపోవడంతో ఒడిశాకు చెందిన ధన మాఝీ అనే వ్యక్తి 10 కి.మీ దూరం తన భార్య శవాన్ని మోసుకెళ్ళాడు.
10 కి.మీ దూరం భార్య శవాన్ని మోసుకెళ్ళిన మాఝీ ఉదంతాన్ని మీడియా ప్రముఖంగా ప్రసారం చేసింది. ఈ ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో మాఝీ జీవితాన్ని ఈ ఘటన మార్చేసింది.

మాఝీ జీవితాన్ని మలుపు తిప్పిన ఘటన
గత ఏడాది అంబులెన్స్ నిరాకరించడంతో పది కి.మీ. దూరం భార్య శవాన్ని మోసుకెళ్ళిన మాఝీ అనే గిరిజనుడి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది.చేతిలో చిల్లిగవ్వ లేని కారణంగానే తన భార్య శవాన్ని భుజంపై మోసుకెళ్ళాడు. ఈ ఘటనపై పలువురు ఆ సమయంలో చలించిపోయారు.మాఝీ ఉదంతంపై ఆ సమయంలో సోషల్ మీడియాలో హట్ టాపిక్గా మారింది. పలువురు ఈ ఘటనపై తమ వంతు సహయాన్ని అందించారు. బహ్రెయిన్ రాజు కూడ మాఝీకి ఆర్థిక సహయం చేశారు.

మాఝీ జీవితంలో మార్పులు
భార్య చనిపోయే సమయంలో మాఝీ కుటుంబం చాలా పేదరికంలో ఉంది. అయితే భార్య చనిపోయి మాఝీ కుటుంబంలో వెలుగు నింపిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. భార్య మృతదేహంతో పది కిలోమీటర్లు భుజాన మోసుకెళ్ళిన ఘటనపై మాఝీ జీవితాన్ని మలుపుతిప్పిన విషయాన్ని గిరిజనులు ప్రస్తావిస్తున్నారు. మీడియాలో వచ్చిన ఈ కథనంతో చలించిపోయిన అనేక మంది మాఝీకి సహయం చేశారు.దీంతో మాఝీ లైఫ్స్టైల్ మారిపోయింది.

మరో వివాహం చేసుకొన్న మాఝీ
ఒడిశాలోని కలహండి జిల్లాకి చెందిన ధనా మాఝీ భార్య అనారోగ్యానికి గురై గతేడాది ఆగస్టులో చనిపోయింది.ఆమె మృతదేహంతో మాఝీ 10 కి.మీ. నడిచాడు. దీంతో
బహ్రెయిన్ ప్రధానమంత్రి, రాజు ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా మాఝీకి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు.రూ.9లక్షల చెక్కును బహ్రెయిన్ రాజు మాఝీకి పంపించారు. ఆయనతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా మాఝీకి సహాయం చేశాయి.మాఝీ అలమతి దై అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు.. ప్రస్తుతం ఆమె గర్భిణి.
మోటార్ బైక్ కొన్న మాఝీ
ప్రధానమంత్రి గ్రామీణ్ ఆవాస్ యోజనా కింద కొత్త ఇంటిని అధికారులు మంజూరు చేశారు. ప్రస్తుతం ఆ ఇల్లు నిర్మాణ దశలో ఉంది. అతడికి సహాయం కింద వచ్చిన నగదును బ్యాంకులో కుమార్తెల పేరిట ఫిక్సిడ్ డిపాజిట్ చేశాడు. ముగ్గురు కుమార్తెలు భువనేశ్వర్లోని రెసిడెన్షియల్ పాఠశాలలో చక్కగా చదువుకుంటున్నారు. ఓ విద్యాసంస్థ ఆయన కుమార్తెలకు ఉచితంగా విద్యను అందిస్తుంది. మాఝీ రూ.65వేలు విలువ చేసే హోండా ద్విచక్రవాహనాన్ని కూడా కొనుగోలు చేశారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications