భద్రతకు ముప్పుగా మారితే దేశమైనా, విదేశమైనా దాడులే- చైనా, పాక్పై దోవల్ నర్మగర్భ వ్యాఖ్యలు
దేశభద్రతకు ముప్పుగా పరిణమించే ఏ భూభాగంపైనైనా దాడులకు మనం సర్వసన్నద్ధంగా ఉన్నట్లు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ విస్పష్టంగా ప్రకటించారు. అది దేశంలో భూభాగమైనా, విదేశీ భూభాగమైనా తాము పట్టించుకోబోమని దోవల్ తాజాగా పొరుగుదేశాలైన చైనా, పాకిస్తాన్ను ఉద్దేశించి వ్యాఖ్యనించారు.
Recommended Video
భారత్ ఎప్పుడూ శత్రుదేశాలపై తొలి దాడి చేయబోదని, వారు దాడికి దిగితే మాత్రం గట్టి సమాధానం ఇచ్చి తీరుతుందని దోవల్ వ్యాఖ్యానించారు. రిషికేష్లోని పరమర్త్ నికేతన్ ఆశ్రమ్ను సందర్శించిన సందర్భంగా మాట్లాడిన దోవల్.. జాతీయ భద్రత విషయంలో రాజీ పడేందుకు సిద్ధంగా లేమన్నారు. న్యూ ఇండియా అంశంపై మాట్లాడిన ఆయన... భారత్కు శత్రువులు తయారవుతున్న ఓ భూభూగాన్ని వదిలిపెట్టబోమన్నారు. అయితే దోవల్ వ్యాఖ్యలు ఏ ఒక్కరినీ నేరుగా ఉద్దేశించనవి కావని అధికారవర్గాలు తెలిపాయి.

భారత్ ఓ నాగరిక దేశమని, ఇక్కడ మతం, భాష వంటి అంశాలకు పెద్దగా ప్రాధాన్యం లేదని, సంస్కృతి పునాదులపైనే ఈ దేశం నిర్మితమైందని అజిత్ దోవల్ తెలిపారు. వాటిని కాపాడుకునేందుకే ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మరోవైపు చైనా, పాకిస్తాన్పై దాడికి కేంద్రం ముహుర్తం నిర్ణయించిందంటూ యూపీ బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో అజిత్ దోవల్ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయన వెళ్లింది ఆశ్రమానికే అయినా చేసిన హెచ్చరికలు చూస్తుంటే శత్రుదేశాలనుద్ధేశించే అని భావిస్తున్నారు.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications