Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భద్రతకు ముప్పుగా మారితే దేశమైనా, విదేశమైనా దాడులే- చైనా, పాక్‌పై దోవల్‌ నర్మగర్భ వ్యాఖ్యలు

దేశభద్రతకు ముప్పుగా పరిణమించే ఏ భూభాగంపైనైనా దాడులకు మనం సర్వసన్నద్ధంగా ఉన్నట్లు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ విస్పష్టంగా ప్రకటించారు. అది దేశంలో భూభాగమైనా, విదేశీ భూభాగమైనా తాము పట్టించుకోబోమని దోవల్‌ తాజాగా పొరుగుదేశాలైన చైనా, పాకిస్తాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యనించారు.

Recommended Video

    : India Will Fight On Our Soil As Well As On Foreign Soil: NSA Ajit Doval|New India

    భారత్‌ ఎప్పుడూ శత్రుదేశాలపై తొలి దాడి చేయబోదని, వారు దాడికి దిగితే మాత్రం గట్టి సమాధానం ఇచ్చి తీరుతుందని దోవల్‌ వ్యాఖ్యానించారు. రిషికేష్‌లోని పరమర్త్‌ నికేతన్‌ ఆశ్రమ్‌ను సందర్శించిన సందర్భంగా మాట్లాడిన దోవల్‌.. జాతీయ భద్రత విషయంలో రాజీ పడేందుకు సిద్ధంగా లేమన్నారు. న్యూ ఇండియా అంశంపై మాట్లాడిన ఆయన... భారత్‌కు శత్రువులు తయారవుతున్న ఓ భూభూగాన్ని వదిలిపెట్టబోమన్నారు. అయితే దోవల్‌ వ్యాఖ్యలు ఏ ఒక్కరినీ నేరుగా ఉద్దేశించనవి కావని అధికారవర్గాలు తెలిపాయి.

    Will fight on our soil as well as on foreign soil, says nsa ajit doval

    భారత్‌ ఓ నాగరిక దేశమని, ఇక్కడ మతం, భాష వంటి అంశాలకు పెద్దగా ప్రాధాన్యం లేదని, సంస్కృతి పునాదులపైనే ఈ దేశం నిర్మితమైందని అజిత్‌ దోవల్‌ తెలిపారు. వాటిని కాపాడుకునేందుకే ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మరోవైపు చైనా, పాకిస్తాన్‌పై దాడికి కేంద్రం ముహుర్తం నిర్ణయించిందంటూ యూపీ బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో అజిత్‌ దోవల్‌ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయన వెళ్లింది ఆశ్రమానికే అయినా చేసిన హెచ్చరికలు చూస్తుంటే శత్రుదేశాలనుద్ధేశించే అని భావిస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+