బెంగళూరులో ఓలా, ఉబెర్ షేర్ సర్వీసులు రద్దు, మహిళలకు వేధింపులు, ఆర్ టీఓలకు ఆదేశాలు !
బెంగళూరు: ఓలా, ఉబెర్ క్యాబ్ ల యాజమాన్యానికి కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలో ఓలా, ఉబెర్ షేర్ క్యాబ్ సర్వీసులు పూర్తిగా రద్దు చేస్తున్నామని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నియమాలు ఉల్లంఘించి ఎవరైనా ప్రవర్థిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ప్రభుత్వం హెచ్చరించింది.
జూన్ 28వ తేదీ శుక్రవారం బెంగళూరులో కర్ణాటక ప్రభుత్వ రవాణా శాఖ ప్రధాన కార్యదర్శి వీపీ. ఇక్కేరి ఆధ్వర్యంలో అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఓలా షేర్ క్యాబ్ సర్వీసులు, ఉబెర్ పూలింగ్ సేవల తీరుపై ప్రధాన చర్చ జరిగింది. షేర్ క్యాబ్ సర్వీసుల్లో ప్రయాణికులకు రక్షణ లేదని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Recommended Video


మహిళా ప్రయాణికుల సురక్షితంగా ప్రయాణిస్తున్నారా అనే విషయంలో అధికారులు చర్చించారు. ఓలా షేర్ క్యాబ్ లు, ఉబెర్ పూలింగ్ వేళల్లో మహిళా ప్రయాణికుల రక్షణ కరువైయ్యిందని, మహిళా ప్రయాణికులకు వేధింపులు ఎక్కువ అయ్యాయని తమ విచారణలో వెలుగు చూసింది.
మహిళా ప్రయాణికులకు రక్షణ లేదని వెలుగు చూడటంతో తక్షణం ఆ సేవలు పూర్తిగా రద్దు చెయ్యాలని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారని రవాణా శాఖ ప్రధాన కార్యదర్శి వీపీ. ఇక్కేరి అన్నారు. ఓలా షేర్ క్యాబ్ లు, ఉబెర్ పూలింగ్ చేవలు కొనసాగిస్తే క్యాబ్ లు సంచరించడానికి ఇచ్చిన అనుమతులు పూర్తిగా రద్దు చేస్తామని ఓలా క్యాబ్, ఉబెర్ సంస్థలను కర్ణాటక ప్రభుత్వం హెచ్చరించింది.
రవాణా శాఖ అధికారులు నిర్వహించిన ఈ సమావేశంలో ట్యాక్సీ సర్వీసుల యజమానులు, డ్రైవర్లు పాల్గొన్నారు. ట్యాక్సీ యజమానులు, డ్రైవర్లతో చర్చించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నామని రవాణా శాఖ ప్రధాన కార్యదర్శి వీపీ. ఇక్కేరి తెలిపారు. ప్రభుత్వ నియమాలు ఉల్లించి ఎవరైనా ప్రవర్థిస్తే అలాంటి వారి మీద తక్షణం చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కర్ణాటకలోని ఆర్ టీఓ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని రవాణా శాఖ ప్రధాన కార్యదర్శి వీపీ. ఇక్కేరి తెలిపారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications