చుడీదారు ధరించిందని ఆలయంలోకి రాకుండా అడ్డుకొన్నారు.
సంప్రదాయ దుస్తుల్లో కాకుండా చుడీదారులో అనంతపద్మనాభ స్వామి ధర్శనం చేసుకోవడానని ఆలయ కమిటీ వ్యతిరేకించింది. అయితే ఈ నిర్ణయాన్ని ఇఓ మాత్రం సమర్థించలేదు. చుడీదారు ధరించిన మహిళలు కూడ దైవ దర్శనం చేసుకోవచ్చన
తిరువనంతపురం :సంప్రదాయ దుస్తులకు విరుద్దంగా చుఢీదారు ధరించిన మహికు అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ప్రవేశాన్ని అడ్డుకొన్నారు ఆలయ కమిటీ, అయితే చుడీదారు ధరించిన మహిళలు కూడ ఆలయంలో దైవదర్శనం చేసుకోవచ్చని ప్రకటించారు ఇఓ. ఈ ఘటన తిరువనంతపురంలో బుదవారం నాడు జరిగింది.
కేరళలోని తిరువనంతపురం లోని అనంతపద్మనాభ ఆలయంలో సంప్రదాయ దుస్తులు వేసుకొన్నవారినే అనుమతించాలని ఆలయ కమిటీ కొన్నాళ్ళుగా చెబుతోంది. హిందుత్వ వాదులు కూడ ఇదే డిమాండ్ ను సమర్థిస్తున్నాయి. అయితే ఆలయ ఇఓ మాత్రం ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాడు.
బుదవారం నాడు ఓ మహిళ చుడీదార్ ధరించి దైవదర్శనానికి వచ్చింది. అయితే ఆలయ కమిటీ ఆమెను దేవుడి దర్శనానికి అనుమతించలేదు. స్థానిక హిందూత్వవాదులు కూడ సమర్థించారు. సంప్రదాయ దుస్తుల్లోనే మహిళలు దేవుడిని దర్శించాలని వారు చెబుతున్నారు.
ఆలయ ఇవో మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆలయ కమిటీ సంప్రదాయ దుస్తులు వేసుకోకుండా ఆలయంలోకి ప్రవేశించడాన్ని ఆయన సమర్థించలేదు.చుదీదారు వేసుకొన్న మహిళలు కూడ దేవాలయంలో దైవ దర్శనం చేసుకోవచ్చని చెప్పారు. వారిని అనుమతిస్తున్నాడు. అయితే ఈ నిర్ణయాన్ని స్థానిక హిందూత్వ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి.