మహిళా కానిస్టేబుల్ పై యాసిడ్ దాడి, భర్తతో గొడవలే కారణమా ,ఇతర కారణాలున్నాయా?
మహిళ కానిస్టేబుల్ పై గుర్తు తెలియని దుండగులు వెల్లూరు జిల్లా తిరుప్పత్తూరులో యాసిడ్ పోసి దాడికి దిగారు.
తమిళనాడు : ఆమె ప్రజలను రక్షించే పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. అయితే ఆమెకే రక్షణ లేకుండా పోయింది. కొందరు గుర్తు తెలియని దుండగులు ఆమెపై యాసిడ్ తో దాడికి దిగారు. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొంది.
తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు జిల్లా తిరుప్పతూరులో ఓ మహిళ కానిస్టేబుల్ పై గుర్తు తెలియని దుండగులు శుక్రవారం రాత్రి యాసిడ్ పోశారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఆమెపై గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై యాసిడ్ పోశారు.
భర్తతో గొడవల కారణంగా పిల్లలతో కలిసి ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. ఈ గొడవలతోనే ఆమె పై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు కూడ ఉన్నాయి.అయితే ఈ దాడికి ఎవరూ పాల్పడ్డారనే విషయాన్ని ఇంకా నిర్థారించలేదు.
తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ లావణ్యను వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. లావణ్య ముఖం, చేతులు తీవ్రంగా కాలిపోయాయని వైద్యులు చెప్పారు. ఈ ఘటనకు భాద్యులైన నిందితులను పట్టుకొనేందుకు గాలింపును చేపట్టామని పోలీసులు చెప్పారు.