ఆమె కాళ్లు, చేతులు కట్టేసి రేప్, స్నేహితులేనని అనుమానం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో నిర్భయ ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో ముప్పై ఏళ్ల వయస్సు గల మహిళ పైన పైశాచికంగా అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారు. ఆమె మృతదేహానికి కాళ్లు, చేతులు కట్టేసి ఉన్నాయి.
ఆమెపై అఏత్యాచారానికి పాల్పడిన అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు తెలిపారు. నిందితులు ఆమె పైన అత్యంత పాశవికంగా లైంగిక దాడికి పాల్పడి, ఆమె రహస్య భాగాల్లోకి వస్తువులు చొప్పించారు. ఆమె కాళ్లు, చేతులు కట్టి వేయడంచతో పాటు మెడ చుట్టూ వస్త్రంతో చుట్టి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు.
ఈ ఘటనకు సంబంధించి ముఖ్య ఆధారాలు లభించాయని, దీని వెనుక బాధితురాలి స్నేహితులు ఇద్దరు ముగ్గురు ఉండి ఉంటారని భావిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అయితే, వారి వివరాలను పోలీసులు వెల్లడించేందుకు నిరాకరించారు. దక్షిణ ఢిల్లీలోని సుల్తాన్ పూర్కు చెందిన ఆమెకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
స్థానికంగా ఓ వర్క్ షాపులో టైలర్గా పని చేస్తోంది. ఆమె భర్త గతంలో ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో బాధిత మహిళనే ఆ ఇంటిని పోషిస్తోంది. శుక్రవారం విధుల్లోకి వెళ్లిన ఆమె కనిపించకుండా పోయింది. ఆమె ఆచూకీ దొరక్కపోవడంతో బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం వసంత్ కుంజ్ ప్రాంతంలోని పొదల్లో ఉండగా సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.