షాక్: మహిళపై ఆరుగురు గ్యాంగ్ రేప్ చేసి వీడియో పోస్ట్ చేశారు
కోట: రాజస్థాన్లోని బరాన్ జిల్లాలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆరుగురు వ్యక్తులు 40 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచార సంఘటనను నిందితులు చిత్రీకరించి, వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు.
నేరం గత నెలలో జరగగా, బాధితురాలు ఆరు రోజుల క్రితం ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారనే విషయం తెలియడంతో బాదితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆరుగురిపై కేసు నమోదు
ఆరుగురు యువకులపై బాధితురాలు మార్చి 5వ తేదీన ఫిర్యాదు చేసింది. ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఎవరినీ అరెస్టు చేయలేదు. బాధితురాలు రోడ్డు పక్కన ఉండే దాబాలో పనిచేస్తుంది.
బైక్పై తీసుకుని వెళ్లి..
నెల రోజుల క్రితం తన బరాన్లోని తన అత్తగారింటికి వచ్చానని, నిందితుల్లో ఒకతను చేతన్ మీనా (21) మోటార్ బైక్పై తీసుకుని వెళ్తానని నమ్మించాడని, అతను తనకు బాగా తెలిసి ఉండడంతో బైక్ ఎక్కానని, అయితే తను సమాస్పూరా గ్రామ సమీపంలోని నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లాడని బాధితురాలు తన ఫిర్యాదులో చెప్పింది.
రేప్ చేసి వీడియో తీశారు
మరో ఐదుగురు కూడా అక్కడికి వచ్చారని, ఆరుగురు తనపై అత్యాచారం చేశారని, దాన్నంతా మొబైల్లో చిత్రీకరించారని బాదితురాలు చెప్పిది. మర్నాడు తనను తన అత్తగారింటి వద్ద దించారని, విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించారని ఆమె వివరించింది.
సోషల్ మీడియాలో వీడియో పోస్టు
అత్యాచార ఘటనకు సంబంధించి వీడియో ఇంటర్నెట్లో పెట్టారని తెలిసి ధైర్యం కూడదీసుకుని తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు చెప్పింది. అది ఆ ప్రాంతమంతా పంపిణీ అయింది. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు సోమవారంనాడు మెజిస్ట్రేట్ ముందు రికార్డు చేశారు.