వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కదులుతున్న కారులో యువతిపై 3 గంటల పాటు ముగ్గురు రేప్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మహిళల పైన దురాఘతాలు ఆగడం లేదు. ముంబైలో ఓ మహిళ పైన భర్త పక్కన ఉండగానే సామూహిక అత్యాచారం చేసిన ఘటన మరవకముందే హర్యానాలో ఓ దళిత యువతి పైన కదులుతున్న కారులో మూడు గంటల పాటు అత్యాచారం జరిగింది.

నార్వానా - తోహన రోడ్డులో ముగ్గురు యువకులు ఆమె పైన అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు బుధవారం నాడు తెలిపారు. ఈ సంఘటన మంగళవారం నాడు సాయంత్రం చోటు చేసుకున్నదని చెప్పారు. ఇందుకు సంబంధించి తోహన పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు అందినట్లు చెప్పారు.

girl

ఆమె రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు రోడ్డుపై నిలబడింది. అంతలో ఓ కారు ఆమె ముందు వచ్చి ఆగింది. తాము అటు వైపే వెళ్తున్నామని ఆమెను నమ్మించారు. రైల్వేస్టేషన్‌ వద్ద విడిచిపెడతామన్నారు. దీంతో వారిని నమ్మి ఆమె కారు ఎక్కింది.

కారు వెళ్తుండగా ముగ్గురు యువకులు ఆమెను లైంగికంగా వేధించారు. ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారు. ఇవే అంశాలతో బాధితురాలు ఫిర్యాదు చేసిందని చెప్పారు. ఆమె పైన గంటల పాటు అత్యాచారం చేసిన అనంతరం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ధహమన్ గ్రామంలో విడిచిపెట్టారు.

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. కారు ఎవరిదో గుర్తించలేదు. బాధితరాలు కూడా గుర్తించలేకపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

English summary
A Dalit woman was allegedly raped inside a moving car by three men after offering her a ride on Narwana-Tohana road here, police said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X