తొలిసారి: ‘శని’ ఆలయ అధ్యక్షురాలిగా మహిళ
ముంబై: మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఉన్న శని శింగనాపూర్ ఆలయం 5 శతాబ్దాల చరిత్రలో తొలిసారి ఓ మహిళ చైర్పర్సన్గా సోమవారం నియమితులయ్యారు. గృహిణి అనితా షీతే(40)కు శని శింగనాపూర్ ఆలయ ట్రస్టు బాధ్యతలు అప్పగించారు.
ఐదేళ్లపాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. కాగా, ఈ కమిటీలో 11 మంది ధర్మకర్తల్లో మరో మహిళ కూడా ఉన్నారు. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఉన్న ఈ ఆలయంలోపలకు మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఉల్లంఘించడానికి ఇటీవల ప్రయత్నం జరిగినప్పుడు ఘర్షణ చోటుచేసుకొంది.

ఆలయంలో ఓ మహిళ ప్రవేశించినందుకు ఆ ప్రాంగణాన్ని శుద్ధి చేయడం వివాదాస్పదమయింది. అయిదు శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో మహిళలపై ఉన్న నిషేధం కొనసాగేలా చూస్తాననీ, గర్భాలయంలోకి మహిళల్ని అనుమతించే ఆలోచనే లేదని అనితా షీతే మీడియాకు స్పష్టం చేశారు.
సంప్రదాయానికి విరుద్ధంగా మహిళలు ఆలయ వేదిక మీదికి వచ్చి పూజలు చేయడంతో ఈ ఆలయం ఇటీవల వార్తల్లోకి ఎక్కింది. శని ఆలయంలో ‘చౌతారా'(శని విగ్రహం) వద్ద పూజలు చేసేందుకు పురుషులనే అనుమతిస్తారు. మహిళలు శని విగ్రహానికి తైలపూజ చేసే సంప్రదాయం ఇప్పటివరకు లేదు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications