వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేప్‌ను అడ్డుకున్న మహిళను కాల్చి చంపారు

By Pratap
|
Google Oneindia TeluguNews

సౌత్ గారో హిల్స్: మేఘాలయలో ఓ మహిళ పట్ల దారుణం జరిగింది. మేఘాలయలో ఏ మహిళపై మిలిటెంట్లు అసభ్యంగా ప్రవర్తించారు. దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆ మహిళపై కాల్పులు జరిపి హత్య చేశారు. తన ఇంటి వెలుపల ఆమెపై అసభ్యంగా ప్రవర్తించి, ఆటోమేటిక్ ఆసాల్ట్ రైఫిల్‌తో కాల్చి చంపారు. మహిళ తనపై అత్యాచారాన్ని ప్రతిఘటించడంతో వారు కాల్చి చంపారు.

మంగళవారం సాయంత్రం ఆ సంఘటన చోటు చేసుకుంది. ఆమె ఐదుగురు పిల్లలను, భర్తను ఇంటిలో నిర్బంధించారు. తొలుత మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి, ఆమె ప్రతిఘటించడంతో కాల్చి చంపారు. ఆమె తలపై దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. పోలీసులు ఈ విషయం చెప్పారు.

Woman Molested, Killed In Front Of Her Children By Alleged Militants in Meghalaya

దాడిన చేసినవారి గారో నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ మిలిటెంట్లుగా అనుమానిస్తున్నారు. ఆ సంస్థను కేంద్ర ప్రభుత్వం 2012లో ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ సంస్థ పలు హత్యలు, అపహరణలకు, బలవంతపు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.

ఆ సంఘటన జిల్లాలోని మారుమూల గ్రామంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. మహిళ వయస్సు దాదాపు 35 ఏళ్లు ఉంటుంది.

English summary
In a shocking incident in Meghalaya's South Garo Hills district, alleged militants shot a woman through her head at point blank range with an automatic assault rifle for resisting their attempt to molest her outside her home on Tuesday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X