కదులుతున్న సిటీ బస్సులో మహిళకు తెలీకుండానే రూ. లక్ష లూటీ
చెన్నై: వేగంగా వెలుతున్న సిటీ బస్సులో మహిళ వ్యానిటీ బ్యాగ్ లో ఉన్న లక్ష రుపాయాల నగదు లూటీ అయిన ఘటన చెన్నై నగరంలో జరిగింది. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో చెన్నైలోని సెవన్ వెల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కేసు నమోదు చేశారు.
చెన్నై నగరంలోని మహాకవి భారతీ నగర్ లో భాగ్యమ్మ అలియాస్ భాగ్యమ్ అనే మహిళ నివాసం ఉంటున్నారు. ఈమె తన బంధవుల దగ్గర ప్రయివేటు చీటి వేశారు. భాగ్యమ్ చీటి వేసిన బంధువు దగ్గర లక్ష రూపాయల నగదు తీసుకుని ఇంటికి బయలుదేరారు.

చెన్నై మెట్రోపాలిటిన్ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (ఎంటీసీ) సిటీ బస్సు రూట్ నెంబర్ 116లో తన బంధువుతో కలిసి భాగ్యమ్ ఇంటికి బయలుదేరారు. ఆ సమయంలో బస్సులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగానే ఉందని సమాచారం.
మార్గం మధ్యలో భాగ్యమ్ కు అనుమానం వచ్చి తన బ్యాగ్ ను పరిశీలించింది. బ్యాగ్ లో లక్ష రూపాయల నగదు మాయం అయిన విషయం గుర్తించి సెవన్ వెల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్సులో పిక్ ప్యాకెట్ జరిగి ఉంటుందని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications