కదులుతున్న సిటీ బస్సులో మహిళకు తెలీకుండానే రూ. లక్ష లూటీ
చెన్నై: వేగంగా వెలుతున్న సిటీ బస్సులో మహిళ వ్యానిటీ బ్యాగ్ లో ఉన్న లక్ష రుపాయాల నగదు లూటీ అయిన ఘటన చెన్నై నగరంలో జరిగింది. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో చెన్నైలోని సెవన్ వెల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కేసు నమోదు చేశారు.
చెన్నై నగరంలోని మహాకవి భారతీ నగర్ లో భాగ్యమ్మ అలియాస్ భాగ్యమ్ అనే మహిళ నివాసం ఉంటున్నారు. ఈమె తన బంధవుల దగ్గర ప్రయివేటు చీటి వేశారు. భాగ్యమ్ చీటి వేసిన బంధువు దగ్గర లక్ష రూపాయల నగదు తీసుకుని ఇంటికి బయలుదేరారు.
చెన్నై మెట్రోపాలిటిన్ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (ఎంటీసీ) సిటీ బస్సు రూట్ నెంబర్ 116లో తన బంధువుతో కలిసి భాగ్యమ్ ఇంటికి బయలుదేరారు. ఆ సమయంలో బస్సులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగానే ఉందని సమాచారం.
మార్గం మధ్యలో భాగ్యమ్ కు అనుమానం వచ్చి తన బ్యాగ్ ను పరిశీలించింది. బ్యాగ్ లో లక్ష రూపాయల నగదు మాయం అయిన విషయం గుర్తించి సెవన్ వెల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్సులో పిక్ ప్యాకెట్ జరిగి ఉంటుందని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.