భర్తకు అనారోగ్యం: చికిత్స కోసం రూ. 45వేలకు కొడుకు విక్రయం

Recommended Video

    భర్త కోసం రూ. 45వేలకు కొడుకు విక్రయం, వీడియో !

    లక్నో: ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భర్తకు చికిత్స చేయించేందుకు కన్న కొడుకును రూ. 45 వేలకు విక్రయించింది ఓ తల్లి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

    ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లా ఢాకియా కోహ్ గ్రామానికి చెందిన హర స్వరూప్ మౌర్య, సంజుదేవీలు భార్య, భర్తలు. మౌర్య భవన నిర్మాణ కార్మికుడుగా పనిచేసేవాడు.

    ఓ ఇంటి నిర్మాణ పనిలో ఉండగా ప్రమాదవశాత్తు గోడ కూలి మౌర్య తీవ్రంగా గాయపడ్డాడు. మూడు నెలలుగా మౌర్య ఆసుపత్రిలో ఉన్నాడు. భర్త మంచాన పడ్డాడు.దీంతో పూట గడవడం కూడ ఆ కుటుంబానికి కష్టంగా మారింది. అప్పటికే గర్భవతిగా ఉన్న సంజు దేవి మగబిడ్డకు జన్మనిచ్చింది.

    అయితే భర్తకు వైద్యం చేయించేందుకు తన 15 ఏళ్ళ బిడ్డను రూ.45 వేలకు విక్రయించింది ఆ తల్లి. మౌర్య కుటుంబాన్ని తాము ఆదుకొంటామని అధికారులు ప్రకటించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+