వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాట్సాప్ మెసేజ్ ఇల్లాలి ప్రాణం తీసింది

|
Google Oneindia TeluguNews

మైసూరు: భర్తతో కలిసి హాయిగా సంసారం చేసుకున్న ఇల్లాలి మొబైల్ కు వచ్చిన మెసేజ్ ఆమె ప్రాణం తీసింది. ఎంత చెప్పినా భర్త వినిపించుకోకపోవడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్ణాటకలోని మైసూరు నగరంలో జరిగింది.

మైసూరు నగరంలోని తిలక్ నగర నివాసి రూపేష్, దావణగెరెకి చెందిన నవ్యశ్రీ (24)ల వివాహం 14 నెలల క్రితం జరిగింది. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి. దంపతులు ఇద్దరు చాల అన్యోన్యంగా ఉండే వారు. రూపేష్ సీఎఫ్ టీఆర్ఐలో పీహెచ్ డీ చేస్తున్నాడు.

ఈనెల 21వ తేదిన ఆదివారం సాయంత్రం రూపేష్ భార్య మొబైల్ తీసుకుని గేమ్స్ ఆడుకుంటున్నాడు. అదే సమయంలో నవ్యశ్రీ మొబైల్ కి ‘యూ ఆర్ మై స్వీట్ హాట్' అంటు వాట్సాప్ లో సందేషం వచ్చింది. రూపేష్ భార్యను పిలిచి అడిగాడు.

women recieved mes on watsupp commited suicide

మెసేజ్ పంపించిన వ్యక్తి తనకు ఎవరో తెలియదని నవ్యశ్రీ చెప్పింది. అయితే రూపేష్ నమ్మలేదు. ఇదే విషయంపై ఇద్దరు వాదించుకున్నారు. నవ్యశ్రీ ఎంత చెప్పినా రూపేష్ పట్టించుకోలేదు. పదేపదే వాగ్వివాదం జరిగింది. చుట్టు పక్కల వారు ఇద్దరికి సర్ది చెప్పారు.

సోమవారం సాయంత్ర నవ్యశ్రీ భర్తకు ఫోన్ చేసింది. తాను ఇంటికి వచ్చి మాట్లాడుతానని రూపేష్ చెప్పాడు. అయితే భర్త తనతో సరిగా మాట్లాడలేదని విరక్తి చెందిన నవ్యశ్రీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నవ్యశ్రీ మొబైల్ కు వాట్సాప్ లో సందేశం పంపించిన గుర్తు తెలియని వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

English summary
women recieved mes on watsupp commited suicide
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X