జాతి వ్యతిరేకులపై చర్యలు తీసుకోండి: రాజ్నాథ్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జేఎన్యూ( జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ) వద్ద జాతి వ్యతిరేక నినాదాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ పోలీసులకు ఆదేశించారు.
పార్లమెంట్పై దాడి కేసులో దోషిగా తేలిన అప్జల్గురు ఉరితీతకు వ్యతిరేకంగా జేన్యూ విద్యార్థులు ఇటీవల ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ శుక్రవారం స్పందించారు.
జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని తాము సహించమని స్పష్టం చేశారు. అలాంటి చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా తాను పోలీసు అధికారులకు సూచించినట్లు రాజ్నాథ్సింగ్ వెల్లడించారు.

ఇది ఇలా ఉండగా, రెండ్రోజుల క్రితం న్యూఢిల్లీలోని ప్రెస్క్లబ్లో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీ జాఫర్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే అలీ జాఫర్ బృందంలోని కొందరు ‘కాశ్మీర్ లేకర్ రెహెనేజ్', ‘అఫ్జల్ గురు అమర్ రహే' అంటూ దేశ వ్యతిరేక, ఉగ్రవాదులకు మద్దతుగా నినాదాలు చేశారు.
అంతేగాక, అఫ్జల్ గురు చిత్రాలను కూడా అక్కడ ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్కు పిసిఐ షోకాజు నోటీసులు పంపింది. అయితే, తన బృందంలోని కొందరు ఇలా నిరసనలు వ్యక్తం చేస్తారని తనకు తెలియని చెప్పారు ప్రొఫెసర్.
‘నా దృష్టికి వచ్చిన వెంటనే నినాదాలు చేయొద్దని వారించా. కానీ, వారు వినలేదు' అని మీడియాతో జాఫర్ చెప్పడం గమనార్హం. 2001లో పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి జరిపిన కేసులో నిందితుడైన అఫ్జల్ గురును 2013లో ఉరితీయడం జరిగింది.
విద్యార్థి సంఘం నేత అరెస్ట్
దేశ రాజధానిలోని జవహర్లాల్ నేషనల్ యూనివర్సిటీలో వివాదం నేపథ్యంలో జేఎన్యూ విద్యార్థి సంఘ ప్రెసిడెంట్ కన్హయ్యా కుమార్ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
మాతృభూమి వ్యతిరేక వ్యాఖ్యలు సహించబోం: స్మృతి ఇరానీ
మాతృదేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే సహించబోమని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. ఢిల్లీలోని జేఎన్యూ(జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ) వద్ద ఆందోళనకారుల నినాదాలను స్మృతి తీవ్రంగా ఖండించారు.
పార్లమెంట్పై దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్గురు ఉరితీతకు వ్యతిరేకంగా జేఎన్యూ విద్యార్థులు మంగళవారం ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. గురువారం ఈ ఘటనపై కేసు నమోదైంది. కాగా, జేఎన్యూలో అఫ్జల్ గురుకు మద్దతుగా కార్యక్రమం నిర్వహించడం ఇది నాలుగోసారి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications