శుభవార్త: రూ.లక్ష పంట రుణాన్ని మాఫీ చేసిన యోగి, రూ.36 వేల కోట్లు ఖర్చు
ఎన్నికల్లో ఇచ్చిన హమీలో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ ఆ రాష్ట్ర రైతులకు రుణ మాఫీ చేసే నిర్ణయం తీసుకొన్నారు.రూ.లక్ష రూపాయాల వరకు పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించారు.
లక్నో:ఎన్నికల్లో ఇచ్చిన హమీలో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ ఆ రాష్ట్ర రైతులకు రుణ మాఫీ చేసే నిర్ణయం తీసుకొన్నారు.రూ.లక్ష రూపాయాల వరకు పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తామని బిజెపి హమీ ఇచ్చింది. ఈ హమీ విషయమై మంగళవారం నాడు నిర్వహించిన తొలి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.
లక్షరూపాయాల వరకు పంటరుణాలు తీసుకొన్నరైతులకు మాఫీ చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం కారణంగా రాష్ట్రంలోని సుమారు రెండున్నరకోట్ల మంది సన్న, చిన్న కారు రైతులు లబ్దిపొందనున్నారు.
36 వేల కోట్ల రైతులు రుణమాఫీ కోసం ఖర్చు చేయనుంది ప్రభుత్వం.ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అక్రమంగా నిర్వహిస్తున్న కబేళాలను నిషేధించేందుకు కూడ క్యాబినెట్ నిర్ణయం తీసుకొంది. అలాగే ఘాజీపూర్ లో ఓ స్టేడియాన్ని నిర్మించేందుకు కూడ నిర్ణయం తీసుకొన్నారు. ఇప్పటికే బుందేల్ ఖండ్ ప్రాంతానికి రూ.47 కోట్లను కేటాయిస్తున్నట్టు సిఎం ప్రకటించారు.