Halal: యూపీలో హలాల్ ఉత్పత్తుల్ని నిషేధించిన యోగీ సర్కార్-తక్షణం అమల్లోకి...
ఉత్తర్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్న యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని రకాల హలాల్ ధృవీకృత ఉత్పత్తులను తక్షణం నిషేధిస్తూ ప్రకటన చేసింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. దీంతో ఇకపై ఉత్తర్ ప్రదేశ్ లో హలాల్ ఉత్పత్తుల అమ్మకాలు నిలిచిపోనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో హలాల్ ఉత్పత్తుల పేరుతో మోసాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు హలాల్ ట్యాగ్తో కూడిన ఉత్పత్తులను పూర్తిగా నిషేధించింది. ప్రజారోగ్యం దృష్ట్యా హలాల్ ధృవీకృత తినదగిన వస్తువుల ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, అమ్మకాలు తక్షణమే ఉత్తరప్రదేశ్లో నిషేధించినట్లు ఫుడ్ కమిషనర్ కార్యాలయం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో విక్రయించే రిటైల్ ఉత్పత్తులకు చట్టవిరుద్ధమైన హలాల్ సర్టిఫికేట్లు జారీ చేసినందుకు లక్నో పోలీసులు పలు సంస్థలపై నిన్న కేసు నమోదు చేశారు.

సరైన అధికారం లేకుండా ఆహారం, సౌందర్య ఉత్పత్తులకు హలాల్ సర్టిఫికేట్లు జారీ చేసే అక్రమ సంప్రదాయాన్ని అరికట్టడానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సిద్ధమయ్యారని ప్రభుత్వ ప్రతినిధి నిన్న ప్రకటించారు. ఇవాళ ఫుడ్ కమిషనర్ కార్యాలయం ఈ నిర్ణయాన్ని తక్షణం అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హలాల్ ఉత్పత్తులు ప్రధానంగా మాంసాహార ఉత్పత్తులు కావడం, వీటిని ఉత్పత్తి చేసేవారు, అమ్మేవారు ముస్లిం వర్గాలకు చెందిన వారు కావడంతో ఎన్నికల ముందు యోగీ సర్కార్ ఉద్దేశపూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యూపీలో పూర్తిగా హిందూత్వ అజెండా అమలు చేయాలని బీజేపీ భావిస్తోంది.
-
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications