Yogi Adityanath : యూపీలో త్వరలో ఆయుష్మాన్ భారత్ కార్డుల జారీ-యోగీ కీలక ఆదేశం..
కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కింద అర్హులైన వారికి యూపీలో ఆయుష్మాన్ భారత్ కార్డుల పంపిణీ మొదలుపెట్టాలని సీఎం యోగీ ఆదిత్యనాథ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షల మేర హెల్త్ కవరేజ్ లభించే ఈ కార్డుల్ని సాధ్యమైనంత త్వరగా లబ్దిదారులకు అందించేందుకు వీలుగా యోగీ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రాధాన్యతగా చేపట్టాలన్నారు. అనారోగ్య చికిత్సకు డబ్బు అడ్డంకిగా మారకూడదన్నారు.
ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల వార్షిక ఆరోగ్య కవరేజీని అందిస్తుంది. ఇందుకోసం లబ్ధిదారులందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డులను అందిస్తున్నారు. గోరఖ్నాథ్ ఆలయంలోని మహంత్ దిగ్విజయ్నాథ్ స్మృతి భవన్ బయట జనతా దర్శన్ నిర్వహించిన సీఎం యోగీ.. ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత అని, ప్రజల ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడానికి అవసరమైతే ముఖ్యమంత్రి విచక్షణా నిధి నుండి అదనపు నిధులు విడుదల చేయాలని ఆదేశించారు.

ప్రజారోగ్యం మన బాధ్యత కాబట్టి ఎవరి వైద్యంలోనూ డబ్బు అడ్డంకి కాకూడదని, ఆయుష్మాన్ కార్డులు అందని వారికి వైద్య కళాశాలలో మెరుగైన వైద్యసేవలు అందజేయాలని యోగీ ఆదేశించారు. అవసరమైతే ఉన్నత ఆరోగ్య కేంద్రాలలో చికిత్స కోసం అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలన్నారు. తద్వారా వీలైనంత త్వరగా వారి చికిత్స కోసం ముఖ్యమంత్రి విచక్షణా నిధి నుండి నిధులు విడుదల చేస్తామన్నారు.

ప్రాధాన్యతా ప్రాతిపదికన అర్హులైన వారి కోసం ఆయుష్మాన్ పబ్లిక్ భారత్ కార్డులను సిద్ధం చేయాలని అధికారులను యోగీ ఆదేశించారు. పోలీస్, రెవెన్యూకి సంబంధించిన ఫిర్యాదులపై స్పందించిన యూపీ ముఖ్యమంత్రి అధికారులు జిల్లా స్థాయిలోనే సమస్యలను పరిష్కరించాలన్నారు. అలాగే వారి సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదన్నారు. పూర్తి నిబద్ధత, పారదర్శకతతో ప్రతి వ్యక్తి సమస్యకు న్యాయమైన పరిష్కారమే ప్రభుత్వ ప్రాధాన్యత అన్నారు.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications