ఎస్పీ కంచుకోట కర్హాల్ లో యోగీ ప్రచారం, కొడుకు పేరే గుర్తులేదని ములాయంపై విమర్శలు
ఉత్తర్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఎస్పీ, బీజేపీ మధ్య సాగుతున్న మాటల యుద్ధం కూడా పతాకస్ధాయికి చేరుకుంటోంది. ఈ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీయే తనకు అసలైన ప్రత్యర్ధి అని డిసైడ్ అయిపోయిన బీజేపీ నేతలు ఆయన్ను టార్గెట్ చేసే పనిలో పడ్డారు. ఇవాళ ఎస్పీ కంచుకోట, అఖిలేష్ పోటీ చేస్తున్న కర్హాల్ లో ఎన్నికల ర్యాలీ నిర్పహించిన సీఎం యోగీ ఆదిత్యనాథ్.. అఖిలేష్ తో పాటు ఆయన తండ్రి ములాయంను కూడా టార్గెట్ చేశారు.
ఎస్పీ వ్యవస్ధాపకుడు ములాయం సింగ్ యాదవ్ తన తాజా ర్యాలీలో మాట్లాడుతూ తన కుమారుడు అఖిలేష్ పేరు మర్చిపోయారంటూ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఎద్దేవా చేశారు. సమాజ్వాదీ పార్టీ పితామహుడు ములాయం సింగ్ యాదవ్ కర్హల్లో ప్రచారం చేస్తున్నప్పుడు తన కుమారుడు, పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పేరును 'మర్చిపోయిన' ఘటనను ప్రస్తావిస్తూ పరిస్ధితులు చాలా దారుణంగా మారిపోయాయంటూ వ్యాఖ్యానించారు.

ఎన్నికల ర్యాలీలో తొలిసారిగా కనిపించిన సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ నిన్న తన కుమారుడు అఖిలేష్ యాదవ్ కోసం ఓట్లు అభ్యర్థించారు. తమ పార్టీ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. పేదరికం, నిరుద్యోగ సమస్యలు పరిష్కారం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఈ సమస్యలపై తమ పార్టీ విధానాలు చాలా స్పష్టంగా ఉన్నాయని యాదవ్ అన్నారు.అయితే, సోషల్ మీడియాలో షేర్ చేసిన నివేదికలు, వీడియోల ప్రకారం, ములాయం తన ప్రసంగం ముగిసే సమయానికి వెళుతున్నప్పుడు,'ఓట్లు అడగడానికి' సమీపంలో నిలబడి ఉన్న ఎంపీ ధర్మేంద్ర యాదవ్ ఆయనకు అఖిలేష్ పేరు గుర్తు చేశారు. ఇది కాస్తా చర్చనీయాంశంగా మారింది.
కర్హాల్ లో ప్రచారం చేస్తూ అక్కడ పోటీలో ఉన్న తన కుమారుడు అఖిలేష్ పేరును ములాయం మర్చిపోయారు. పక్కనే ఉన్న పార్టీ నేత గుర్తుచేయడంతో ములాయంతో పాటు చుట్టుపక్కల వారందరూ నవ్వడం మొదలుపెట్టారు. ఒక క్షణం, నాయకుడు కర్హాల్ అభ్యర్థి పేరును మరచిపోయినట్లు అనిపించి, 'ఇక్కడ అభ్యర్థి ఎవరైనప్పటికీ' గెలిపించాలని ప్రజలను కోరారు. పార్టీ నేత ధర్మేంద్రయాదవ్ చెప్పాక... ములాయం మాట్లాడుతూ అఖిలేష్ భారీ మెజార్టీతో గెలవాలని ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications