యోగీతో హిమాచల్ గవర్నర్ ఎస్పీ శుక్లా భేటీ-ఇరు రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధంపై చర్చలు..
యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా భేటీ అయ్యారు. ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ కు వచ్చిన గవర్నర్ ఎస్పీ శుక్లా.. సీఎంకు శాలువాతో పాటు హిమాచల్ టోపీని కూడా బహుకరించారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై ఇరువురూ చర్చించారు. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై ఓ అవగాహనకు కూడా వచ్చినట్లు తెలుస్తోంది.
హిమాచల్ గవర్నర్ శుక్లా రాక సందర్భంగా సీఎం యోగీ ఆదిత్యనాథ్ గురు గోరఖ్ నాథ్ తో పాటు తన గురువు మహంత్ అవైద్యనాథ్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గవర్నర్ తో కలిసి ఇరు రాష్ట్రాల్లో పరిస్దితులపై చర్చించారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య సాంస్కృతిక అంశాల్ని పంచుకునే అంశంపై యోగీ-శుక్లా చర్చించారు. పొరుగు రాష్ట్రాలైన యూపీ, హిమాచల్ లో సారూప్యతలు ఉన్నాయని, వాటి ఆధారంగా సాంసృతిక బంధాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు.

ఈ పర్యటన ముగిశాక హిమాచల్ ప్రదేశ్ రాజ్ భవన్ ట్విట్టర్ లో యోగీ ఆదిత్యనాథ్, గవర్నర్ శుక్లా భేటీకి సంబంధించిన వీడియోల్ని, వివరాల్ని పోస్ట్ చేసింది. ఇందులో గవర్నర్ శుక్లా.. తాను అందరూ బావుండాలని గురు గోరఖ్ నాథ్ ను ప్రార్ధించినట్లు తెలిపారు. యూపీ ప్రభుత్వం కూడా హిమాచల్ ప్రదేశ్ శుక్లా పర్యటనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. గవర్నర్ తో కలిసి సీఎం యోగీ.. ఈ టూర్ ఆద్యంతం ఉల్లాసంగా గడిపారు. బీజేపీ మాజీ నేత అయిన శుక్లాతో సన్నిహిత సంబంధాలు కలిగిన యోగీ ఆదిత్యనాథ్.. ఈ పర్యటన ద్వారా ఇరు రాష్ట్రాల మధ్య సాంస్కృతిక సంబంధాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications