G20 Summit : జీ20 సదస్సు సక్సెస్ పై మోడీకి యోగీ థ్యాంక్స్-ప్రపంచానికే మైలురాయని వెల్లడి..
జీ20 సదస్సు విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ నాయకత్వ పటిమపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడా రాజకీయాలకు అతీతంగా ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీ బీజేపీ నేతలు కూడా ప్రధాని మోడీని ఆకాశానికెత్తేస్తున్నారు. ప్రధాని మోడీకి జీ20ని సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు చెబుతున్నారు. ఇదే క్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కూడా స్పందించారు.
జీ20 సదస్సును విజయవంతంగా పూర్తి చేసినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిఖరాగ్ర సమావేశం ప్రపంచానికి ఒక మైలురాయి అని అభివర్ణించారు. సోషల్ మీడియాలో వరుస పోస్ట్ల ద్వారా ఈ "గ్రాండ్" ఈవెంట్ను నిర్వహించినందుకు ప్రధాని మోడీని ఆదిత్యనాథ్ ప్రశంసించారు. ఎక్స్ లో పెట్టిన ఓ పోస్ట్లో యోగీ ఆదిత్యనాథ్ .. "ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో విజయవంతంగా ముగిసిన జీ20 శిఖరాగ్ర సమావేశం దాని లక్ష్య లక్ష్యాలను సాధించే దిశగా బలంగా ముందుకు సాగిందన్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం ఒక భూమి-ఒక కుటుంబం-ఒక భవిష్యత్తు భావన యొక్క సాక్షాత్కారంలో 'మైలురాయి'గా నిరూపించబడుతుందన్నారు.

మరో పోస్ట్లో యోగీ ఆదిత్యనాథ్ జీ20 సభ్య దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. "భారత్ అధ్యక్షతన జీ20 సభ్యులు న్యూఢిల్లీ నాయకుల డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించడం చారిత్రాత్మకమైనదన్నారు. సుసంపన్నమైన భవిష్యత్తు కోసం సహకార స్ఫూర్తితో చేసిన ఈ ప్రయత్నాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు జి20 సభ్యులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని రాశారు.
మూడవ పోస్ట్లో సీఎం యోగీ ఆదిత్యనాథ్.. జీ20 శిఖరాగ్ర సమావేశంలో భారతదేశం యొక్క ప్రయత్నాల కారణంగా ఆఫ్రికన్ యూనియన్ జీ20 శాశ్వత సభ్యునిగా చేరడం పట్ల కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇలా జీ20 సదస్సు విజయానికి సంబంధించిన పలు అంశాలపై యోగీ ఆదిత్యనాథ్ పెట్టిన పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications