క్రిమినల్స్ను ఏరిపారేసే ప్రక్రియ ప్రారంభమైంది..ఇక కాస్కోండి..!
లక్నో: రాష్ట్రంలో క్రిమినల్స్ను మాఫియాను అణగదొక్కుతామని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అసెంబ్లీ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ మేరకు చర్యలు ప్రారంభించిందని రాష్ట్రమంత్రి జేపీఎస్ రాథోడ్ స్పష్టం చేశారు.క్రిమినల్స్ను అంతమొందించే కార్యక్రమం రాష్ట్రప్రభుత్వం ప్రారంభించిదని చెప్పారు. రాష్ట్రాన్ని షేక్ చేసిన ఉమేష్ పాల్ హత్య విషయంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అర్బాజ్ ప్రయాగ్రాజ్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఈ ఘటన జరిగిన ఒక్క రోజుకే రాష్ట్ర మంత్రి ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది.2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ను అతని నివాసం బయట గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తిన విషయంపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో క్రిమినల్స్ ఏరిపారేసి మట్టిలో కలిపేస్తామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర్ ప్రదేశ్లో క్రిమినల్స్ అనే వారు లేకుండా చేస్తామని చెప్పిన యోగీ... ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎవరినైనా తమ ప్రభుత్వం విడిచిపెట్టదని తీవ్రంగా హెచ్చరించారు.

ఇక వికాస్ దూబే మృతిపై మాట్లాడిన మంత్రి రాథోడ్...ప్రయాగ్ రాజ్లో ఏమైందో చూశారుగా అని అన్నారు. క్రిమినల్స్ అందరూ దొరకనంత వరకు దొరలే అని చెప్పిన మంత్రి.. ఒక్కసారి దొరికితే మాత్రం పోలీసు వాహనంలో తీసుకెళుతుండగా ఆ వాహనం బోల్తా పడిందని చెబుతూ ఏడవ కూడదని అన్నారు. వికాస్ దూబే ఉజ్జయినీ నుంచి కాన్పూర్కు పోలీస్ కాన్వాయ్లో తీసుకొస్తుండగా కాన్వాయ్లోని ఓ వాహనం గతి తప్పడంతో..ఇదే అదునుగా భావించిన దూబే.. పోలీసుల నుంచి తుపాకీ లాక్కుని వారిపై కాల్పులకు దిగాడు. దీంతో ఎదురుకాల్పుల్లో అతను మృతి చెందాడు. ఇదిలా ఉంటే ఉమేష్ పాల్ హత్యతో ఒక్కసారిగా రాష్ట్రం వణికిపోయింది. ఈ హత్యకు సంబంధించి ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకోవడం విశేషం.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications