యోగీ ఎఫెక్ట్ : వారణాసిలో Y20 సదస్సు-మూడు రోజుల భేటీకి జీ20 ప్రతినిధులు..
జీ20 సదస్సుకు సన్నాహంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో కేంద్రం పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా యూపీలోని వారణాసిలో మూడు రోజుల పాటు వై20 పేరుతో మరో సదస్సు జరగబోతోంది. ఇందులో జీ20 దేశాలు, పలు అంతర్జాతీయ సంస్ధలకు చెందిన 100 మందికిపైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలశాఖ దీన్ని నిర్వహిస్తోంది.
Y20 సమ్మిట్ కోసం మొత్తం ఐదు థీమ్లు గుర్తించారు.
ఫ్యూచర్ ఆఫ్ వర్క్: ఇండస్ట్రీ 4.0, ఇన్నోవేషన్, 21వ శతాబ్దపు నైపుణ్యాలు, శాంతి నిర్మాణం, సయోధ్య: యుద్ధం లేని యుగం, వాతావరణ మార్పు, విపత్తు రిస్క్ తగ్గింపు వంటి థీమ్ లను వై20 సదస్సుకు ఎంపిక చేసినట్లు యోగీ సర్కార్ తెలిపింది.గత కొన్ని నెలలుగా జరిగిన చర్చల ముగింపుల ఆధారంగా రూపొందించిన Y20 అజెండాపై చర్చించి, ఖరారు చేసి సంతకం చేసేందుకు G20 దేశాలకు చెందిన యువత నిపుణులు, నిర్ణయాధికారులు, యువ ప్రతినిధులను ఈ సదస్సుకు ఆహ్వానించారు.

ఈ సదస్సు ఇతర భాగస్వాములతో సహకారం, నెట్వర్కింగ్కు అవకాశాలను అందిస్తుందని నిర్వాహకులు తెలిపారు. అలాగే యువత అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఇది భారతీయ విజ్ఞాన సంస్థలకు అంతర్జాతీయ సంప్రదింపుల ప్రాధాన్యతపై దృక్పథాన్ని అందజేస్తుందని కేంద్రం తెలిపింది. బయటి ప్రపంచం మనపై ప్రభావం చూపగలదని తెలుసుకోవటానికి ఇది పనికొస్తుందని, సంప్రదింపులను నిర్వహించడానికి వారికి ప్రయోగాత్మక అనుభవాన్ని అందిస్తుందని వెల్లడించింది.
Y20 సమ్మిట్ G20 ప్రాధాన్యతలపై యువత తమ స్వరాలు, ఆలోచనలను వ్యక్తీకరించడానికి ఇదో వేదికను అందిస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ Y20 సమ్మిట్కు హాజరుకానున్నారు. G20 ప్రెసిడెన్సీ ఫ్రేమ్వర్క్ కింద యువజన వ్యవహారాల శాఖ, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, యూత్20 (Y20) సమ్మిట్-2023ని నిర్వహించే బాధ్యతను అప్పగించింది.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications