వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తండ్రిలా అండగా నిలిచారు.. స్పూర్తినిచ్చినందుకు కృతజ్ఞతలు: మోడీ 'టచింగ్' లెటర్

మద్దతుగా నిలిచినందుకు, స్పూర్తినిచ్చినందుకు ప్రణబ్‌కు మోడీ కృతజ్ఞతలు తెలిపారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాష్ట్రపతిగా తన చివరి రోజున ప్రధాని మోడీ నుంచి ఒక లేఖ అందుకున్నానని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. మోడీ రాసిన లేఖను ట్విట్టర్ లో ఆయన షేర్ చేశారు. మూడేళ్ల కాలంలో ప్రణబ్ తనపై ఎంతో ప్రేమను, వాత్యల్యాన్ని చూపించారని మోడీ తన లేఖలో చెప్పారు.

'ప్రణబ్ దా.. మన రాజకీయ ప్రస్థానాలు విభిన్నమైన రాజకీయ నేపథ్యాల్లో రూపుదిద్దుకున్నాయి. అయినా మీ మేధోబలం, విజ్ఞత వల్ల మనం సమిష్టితత్వంతో కలిసి పనిచేయగలిగాం' అని అన్నారు.

you have been a father figure to me says modi

మూడేళ్ల క్రితం ఒక బయటి వ్యక్తిగా తాను ఢిల్లీ వచ్చానని, ఆ సమయంలో తన ముందున్న కర్తవ్యంతో సవాళ్లతో కూడుకున్నదని, కానీ మీరిచ్చిన ప్రోత్బలం నాకు అండగా నిలిచిందని ప్రణబ్ ను ఉద్దేశించి మోడీ చెప్పుకొచ్చారు. ఒక తండ్రి లాగా, గురువు లాగా నాకు అండగా నిలిచారని అన్నారు.

'మీ మేదస్సు, వ్యక్తిగత అనుబంధం నాకెంతో ఆత్మవిశ్వాసాన్ని, బలాన్ని ఇచ్చాయి. మీకున్న అపార జ్ఞానం, మేధో నైపుణ్యం ప్రభుత్వానికి ఎంతగానో తోడ్పడ్డాయి' అని లేఖలో వివరించారు. మద్దతుగా నిలిచినందుకు, స్పూర్తినిచ్చినందుకు ప్రణబ్‌కు మోడీ కృతజ్ఞతలు తెలిపారు.

English summary
Former President Pranab Mukherjee on Thursday shared a letter he received from Prime Minister Narendra Modi on his last day in office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X