IT HUB: రూ. 500 కోసం ప్రాణం తీసిన సెబాస్టియన్, ప్రాణం కోసం పోరాడిన కార్మికుడు, సీసీటీవీల్లో !
బెంగళూరు: చిన్న చిన్న విషయాలకు హత్యలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఐటీ హబ్ లో ఓ వ్యక్తి కార్మికుడిగా పని చేస్తు జీవనం సాగిస్తున్నాడు. మరో యువకుడు పానీపూరీ బండి దగ్గర ప్లేట్లు శుభ్రం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రాత్రి పని ముగించుకున్న కార్మికుడు మద్యం సేవించి తరువాత భోజనం చేసి అతను నివాసం ఉంటున్న ఏరియాలోని ఓ షాపు ముందు నిద్రపోయాడు. పానీపూరీ బండి దగ్గర పని ముగించుకున్న యువకుడు క్వాటర్ మద్యం సేవించి ఇంటికి బయలుదేరాడు. మార్గం మద్యలో కార్మికుడు నిద్రపోతున్న విషయం గమనించిన యువకుడు అతని దగ్గర ఉన్న డబ్బులు, మొబైల్ లూటీ చెయ్యాలని స్కెచ్ వేశాడు. కార్మికుడి జోబులో ఉన్న రూ. 500, మొబైల్ లాక్కొంటున్న సమయంలో కార్మికుడు నిద్రలేచి ఎదురు తిరిగాడు. ఆ సమయంలో కార్మికుడి మీద దాడి చేసిన యువకుడు పక్కనే ఉన్న సిమెంట్ ఇటుక తీసుకుని కార్మికుడిని దారుణంగా హత్య చేశాడు. కేవలం రూ. 500 కోసం కార్మికుడు హత్యకు గురి కావడం కలకలం రేపింది.
Russia Ukraine War: అమెరికాకు షాక్ ఇచ్చిన సల్మాన్, సౌదీ, అరబ్ మైండ్ గేమ్, జోబైడెన్ తో రివైంజ్ !
కార్మికుడు, పానీపూరీ బండి దగ్గర ?
కర్ణాటకలోని మండ్య జిల్లాలోని మద్దూరుకు చెందిన సతీష్ (42) అనే వ్యక్తి బెంగళూరు చేరుకుని కార్మికుడిగా పని చేస్తు జీవనం సాగిస్తున్నాడు. భద్రావతికి చెందిన సెబాస్టిన్ (19) అనే యువకుడు బెంగళూరు చేరుకుని కావేరీనగర్ లో నివాసం ఉంటూ పానీపూరీ బండి దగ్గర ప్లేట్లు శుభ్రం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
రాత్రి మద్యం సేవించి నిద్రపోయాడు
ఫిబ్రవరి 24వ తేదీ రాత్రి పని ముగించుకున్న కార్మికుడు సతీష్ మద్యం సేవించి తరువాత భోజనం చేసి అతను నివాసం ఉంటున్న కామాక్షిపాళ్యలోని బస్ స్టాప్ సమీపంలోని ఓ షాపు ముందు నిద్రపోయాడు. పానీపూరీ బండి దగ్గర పని ముగించుకున్న సెబాస్టియన్ క్వాటర్ మద్యం సేవించి అతను నివాసం ఉంటున్న ఇంటికి బయలుదేరాడు.
డబ్బు, మొబైల్ లూటీ చెయ్యాలని
మార్గం మద్యలో కార్మికుడు సతీష్ నిద్రపోతున్న విషయం గమనించిన సెబాస్టియన్ అతని దగ్గర ఉన్న డబ్బులు, మొబైల్ లూటీ చెయ్యాలని స్కెచ్ వేశాడు. కార్మికుడు సతీష్ జోబులో ఉన్న రూ. 500, మొబైల్ లాక్కొంటున్న సమయంలో కార్మికుడు నిద్రలేచి సెబాస్టియన్ ను అడ్డుకుని అతనికి ఎదురు తిరిగాడు.
రూ. 500 కోసం చంపేసి ఎస్కేప్
ఆ సమయంలో సహనం కోల్పోయిన సెబాస్టియన్ సతీష్ మీద దాడి చేశాడు. మద్యం మత్తులో ఉన్న సతీష్ మీద దాడి చేసిన సెబాస్టియన్ పక్కనే ఉన్న సిమెంట్ ఇటుక (హాలో బ్లాక్) తీసుకుని కార్మికుడు సతీష్ తల మీద దాడి చేసి దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారైనాడు. మరుసటి రోజు సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు హత్య చేసి తప్పించుకుని తిరుగుతున్న సెబాస్టియన్ ను బుధవారం అరెస్టు చేశారు. కేవలం రూ. 500 కోసం కార్మికుడు సతీష్ హత్యకు గురి కావడం బెంగళూరు నగరంలో కలకలం రేపింది.