చైనా దురాగతం: ప్రజాస్వామ్యం కావాలన్నందుకు.. పది వేల మందిని చంపేశారు!
చైనాలోని తియాన్మెన్ స్క్వేర్ వద్ద జరిగిన ఓ పోరాటానికి సంబంధించిన ప్రాణ నష్టంపై బ్రిటన్ రహస్య దౌత్య సమాచార విభాగం ఇటీవల సంచలన విషయాలను వెల్లడించింది.
బీజింగ్: చైనాలోని తియాన్మెన్ స్క్వేర్ వద్ద జరిగిన ఓ పోరాటానికి సంబంధించిన ప్రాణ నష్టంపై బ్రిటన్ రహస్య దౌత్య సమాచార విభాగం ఇటీవల సంచలన విషయాలను వెల్లడించింది.
తమకు ప్రజాస్వామ్యం కావాలంటూ 1989 జూన్ నెలలో తియాన్మెన్ స్క్వేర్ వద్ద జరిగిన పోరాటంలో దాదాపు 10 వేలమందిని చైనా సైన్యం చంపేసిందట. ''ఆనాడు జరిగిన ఉద్యమంలో కనీసం 10,000 మందిని చంపేసినట్లు అంచనా..'' అని చైనాలో బ్రిటన్ రాయబారి అలాన్ డోనాల్డ్ లండన్కు ఆనాడు పంపిన టెలిగ్రాంలో పేర్కొన్నారు.

ఆ విషయానికి సంబంధించిన డాక్యుమెంట్ ఒకటి 28 ఏళ్ల తర్వాత ఇప్పుడు బయటికొచ్చింది. చైనాలో కమ్యునిస్టు ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే. అయితే, తమకు మిగతా దేశాల మాదిరిగా ప్రజాస్వామ్య పరిపాలన కావాలంటూ దాదాపు ఏడు వారాలపాటు పౌరులు వీధుల్లోకి వచ్చి పోరాడారు.
1989 మే నెల నుంచే ఈ పోరాటం ప్రారంభమైంది. అయితే, జూన్ 5న వారంతా తియాన్మెన్ స్క్వేర్ వద్దకు చేరుకొని ఉద్యమించగా వారిపై చైనా సైన్యం కాల్పులు జరిపింది.
అప్పట్లో ఆ ఘటనలో ఒక వెయ్యిమంది చనిపోయారంటూ చైనా ప్రపంచాన్ని నమ్మించింది. అయితే, అది నిజం కాదని, అందుకు పదిరెట్ల మందిని చంపేసినట్లు నాటి బ్రిటన్ రాయబారి టెలిగ్రాం ద్వారా తాజాగా తెలిసింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications