బస్సు అదుపుతప్పి పల్టీ కొట్టి 24 మంది దుర్మరణం
ఢాకా: వేగంగా వెళుతున్న బస్సు అదుపుతప్పి చెట్ల పోదల్లోకి దూసుకుని వెళ్లి పల్టీ కొట్టడంతో 24 మంది దుర్మరణం చెందిన సంఘటన బంగ్లాదేశ్ లో జరిగింది. గురువారం వేకువ జామున 1.20 గంటల సమయంలో బారిసల్ - ఢాకా జాతీయ రహదారిలో ఈ ప్రమాదం జరిగింది.
సుమారు 50 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. మార్గం మద్యలో ఫరిద్ పూర్ జిల్లాలోని బంగా ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న పోదలలోకి దూసుకు వెళ్లడంతో ప్రమాదం జరిగిందని జిల్లా సీనియర్ పోలీసు అధికారి బెలాల్ హాసన్ చెప్పారు.

బుధవారం రాత్రి బస్సు ఢాకా బయలుదేరింది. బస్సులో ఉన్న ప్రయాణికులలో చాల మంది ఢాకా వెళ్లవలసి ఉందని పోలీసులు చెప్పారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెప్పారని, ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మరణించాడని పోలీసు అధికారులు అన్నారు.
తీవ్రగాయాలైన 22 మందిని ఫరిద్ పూర్ లోని ఆసుపత్రులకు తరలించామని ఫైర్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ షంసుజ్జోవ్ అన్నారు. బంగ్లాదేశ్ లో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయని, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి వాహనాలు నడపడమే అందుకు కారణమని పోలీసు అధికారులు తెలిపారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications