సౌదీలో అగ్ని ప్రమాదం: 25 మంది సజీవదహనం
సౌదీ: సౌదీ అరేబియాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25 మంది సజీవదహనం అయ్యారు. ఈ ప్రమాదంలో 100 మందికి పైగా తీవ్రగాయాలై ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని సౌదీ అరేబియా సివిల్ డిఫెన్స్ అధికారులు తెలిపారు.
దక్షిణ సౌదీలోని జుజాన్ ఆసుపత్రిలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. ఆసుపత్రి ఇంటెన్సీవ్ కేర్ లో ముందుగా మంటలు వ్యాపించాయి. తరువాత మెటర్నటీ వార్డులకు మంటలు వ్యాపించాయి.
విషయం తెలుసుకున్న అగ్నిమాపక, రెస్కూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. తీవ్రగాయాలైన వారికి అంబులెన్స్ లలో వేరే ఆసుపత్రులకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
మంటలు అదుపులోకి వచ్చాయని పోలీసు అధికారులు ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే మీడియా సౌదీ సివిల్ డిఫెన్స్ అధికారులను సంప్రదించగా, మంటలు అదుపులోకి వచ్చాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
అయితే ఆసుపత్రిలో ఇంటెన్సీవ్ కేర్ లో మంటలు ఎలా వ్యాపించాయి అని కచ్చితంగా తెలియడం లేదని అధికారులు చెప్పారు. ఈ అగ్నిప్రమాదంపై వివిద కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.