ఉక్రెయిన్లో 3 వేల మంది విద్యార్థుల బందీ: పుతిన్ సంచలనం
రష్యా ఉక్రెయిన్ యుద్దంలో మునిగిపోయాయి. ఇతర దేశాలకు చెందిన వారి తరలింపు కొనసాగుతోంది. ఇండియాకు చెందిన విద్యార్థులను కూడా తరలిస్తున్నారు. అయితే ఉక్రెయిన్లో ఇంకా భారతీయులు ఉన్నారట. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. 3 వేల మంది విద్యార్థులు బందీలుగా ఉన్నారని వివరించారు.

భారత్తో పాటు చైనా విద్యార్థులు కూడా బందీలుగా ఉన్నారని తెలిపారు. ఉక్రెయిన్ నుంచి విద్యార్థుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. విదేశీయులను బందీలుగా ఉంచడానికి ఉక్రెయిన్ ప్రయత్నిస్తోందని.. దీంతో బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉంటుందని పుతిన్ తెలిపారు. ఇటు భారత్ ఆపరేషన్ గంగా చేపట్టింది. ఉక్రెయిన్లో ఉన్న విద్యార్థుల తరలింపు ప్రక్రియ చేపట్టింది. ఇప్పటి వరకు 18 నుంచి 20 వేల మంది విద్యార్థులను సురక్షితంగా తరలించారు. పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సిందియా రంగంలోకి దిగారు. అయితే అంతకుముంద ఓ విద్యార్థి చనిపోగా.. మరో విద్యార్థి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మృతిచెందాడు.
ఇటు కర్ణాటకలోని హవేరి జిల్లాకు చలగేరి గ్రామానికి చెందిన నవీన్ శేఖరప్ప.. ఖర్కివ్లో స్టోర్కు వెళ్లిన సమయంలో బాంబుల దాడి జరిగింది. దీంతో అతను తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. మెడిసిన్ నాలుగో సంవత్సరం చదువుతున్న నవీన్.. మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. నవీన్ కుటుంబసభ్యులతో కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై ఫోన్లో మాట్లాడారు.
Recommended Video
ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిన్ననే రంగంలోకి దిగిపోయింది. విదేశాంగ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఉక్రెయిన్లోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు సీ-17 విమానాలను ఉక్రెయిన్ పంపేందుకు ఏర్పాట్లు చేసింది. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను అక్కడి నుంచి తరలించేందుకు సహకరించాలని అటు ఉక్రెయిన్తో పాటు ఇటు రష్యాను కోరాలని విదేశాంగ శాఖకు మోడీ ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే ఆ రెండు దేశాలతో విదేశాంగ శాఖ చర్చలు ప్రారంభించింది. అయినప్పటికీ బందీలుగా ఉన్నారని పుతిన్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఇద్దరం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రతిపాదించారు. దీంతో సమస్య పరిష్కారం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications