కాసినో రిసార్ట్స్లో కాల్పులు: 36మంది మృతి, పలువురికి గాయాలు
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో దారుణం చోటుచేసుకుంది. మనీలా ఎయిర్పోర్టుకు సమీపంలో ఉన్న కాసినో రిసార్ట్లో గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో 36 మంది మృతిచెందారు. మరికొంతమంది గాయాలపాలయ్యారు.
మనీలా: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో దారుణం చోటుచేసుకుంది. మనీలా ఎయిర్పోర్టుకు సమీపంలో ఉన్న కాసినో రిసార్ట్లో గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. దీంతో 36 మంది మృతిచెందారు. మరికొంతమంది గాయాలపాలయ్యారు.
దోపిడీ చేసేందుకు వచ్చిన దుండగుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు చెప్పారు. దీన్ని ఉగ్రవాద చర్యగా భావించడం లేదని వెల్లడించారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

వివరాల్లోకి వెళితే.. రిసార్ట్స్ వరల్డ్ క్యాసినోలో శుక్రవారం తెల్లవారుజామున ముసుగు ధరించిన ఓ వ్యక్తి పౌరులపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. టేబుళ్లకు నిప్పుపెట్టి, ఆ తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. దీంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన ప్రజలు పరుగులు తీశారు.
మరికొందరు బిల్డింగ్ రెండో ఫ్లోర్ నుంచి దూకేశారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. టేబుల్స్కు నిప్పుపెట్టడంతో పొగతో ఉక్కిరిబిక్కిరై ఎక్కువ మంది మృతి చెందినట్లు తెలిసింది. తొలుత ఈ ఘటనను ఉగ్రవాదుల దాడిగా భావించినా.. ఆ తర్వాత కాదని పోలీసులు తేల్చారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications