వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూఎస్-ఎన్ఏఈలో నలుగురు భారత అమెరికన్లు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: ప్రతిష్ఠాత్మక అమెరికా జాతీయ సాంకేతిక అకాడమీ(ఎన్‌ఏఈ)లో నలుగురు భారతీయ అమెరికన్లకు చోటు దక్కింది. సమాజానికి విలువైన సేవలనందించేందుకు తాజాగా 80 మందికి అకాడమీ అవకాశం కల్పించింది. వీరిలో భారతీయ అమెరికన్లయిన అనీల్‌ కె జైన్‌, డాక్టర్‌ ఆరతి ప్రభాకర్‌, గణేశ్‌ ఠాకూర్‌, డాక్టర్‌ ఆర్‌కె శ్రీధర్‌ పేర్లు కూడా ఉన్నాయి.

మంగళవారం సమావేశం అనంతరం అకాడమీ ఈ పేర్లను వెల్లడించింది. మిచిగన్‌ స్టేట్‌ వర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న జైన్‌కు.. ఇంజిరింగ్‌, బయోమెట్రిక్‌ విభాగాల్లో విశేష కృషి చేసినందుకు ఈ అవకాశం దక్కింది.

4 Indian-Americans Selected To US National Academy Of Engineering

రక్షణ అధునాతన పరిశోధన ప్రాజెక్టుల సంస్థ (డీఏఆర్‌పీఏ) డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆరతి.. అధునాతన సూక్ష్మ వాహకత, సమాచార సాంకేతికత విభాగాల్లో తన ప్రతిభను నిరూపించుకున్నారు.

ఠాకూర్‌ సర్వీసెస్‌ ఐఎన్‌సీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న గణేష్ ఠాకూర్.. జలాశయ సమగ్ర నిర్వహణ విధానాలను విజయవంతంగా అమలుచేసి అకాడమీలో చోటు సంపాదించారు. బ్లూమ్‌ ఇంధన కార్పొరేషన్‌ సీఈవో, సహ వ్యవస్థాపకుడైన శ్రీధర్‌.. రవాణా రంగం, శుద్ధ ఇంధన విభాగాల్లో సేవలందించారు. వీరు అందిస్తున్న సేవలకు గుర్తింపు అమెరికా ఎన్ఏఈలో స్థానం దక్కింది.

English summary
Four Indian-Americans have been selected to the prestigious US National Academy of Engineering (NAE) to be part of its new list of 80 members for their valuable contributions to the society.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X