కొలంబియాలో విమాన ప్రమాదం, 8 మంది మృతి
కొలంబియాలో విమాన ప్రమాదం జరిగింది. 8 మందితో ప్రయాణిస్తోన్న చిన్న విమానం మెడిలిన్ నగరంలో సోమవారం కుప్పకూలింది. ఉదయం ఒలయో హెర్రెరా విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరింది. ఇంజిన్ ఫెయిల్ కావడంతో ఇంటిని ఢీ కొట్టింది. దీంతో దట్టమైన పొగ గాలి ద్వారా వ్యాపించి ఆ ప్రాంతం దుమ్ముతో నిండింది.
విమానంలో ఉన్న 8 మంది చనిపోయారు. వీరిలో ఆరుగురు ప్రయాణికులు.. ఇద్దరు సిబ్బంది ఉన్నారు. విమానం పడిన ఇంటిలో ఉన్నవారు చనిపోయారా.. లేదంటే గాయపడ్డారా అనే విషయపై క్లారిటీ రాలేదు. విమాన ప్రమాదం బెలెన్ రోసాలెస్ సెక్టార్ వద్ద జరిగింది. బాధితులను ఆదుకుంటామని మేయర్ డేనియల్ క్వింటెరో తెలిపారు.
విమానం మెడిలిన్ నుంచి పొరుగున గల చోకో విభాగంలో గల పిజార్రోకు వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. విమానం టేకాఫ్ సమయంలో ఇంజిన్ ఫెయిల్ అయ్యింది. ఈ మేరకు సిగ్నల్ ఇచ్చింది. ప్రమాదానికి పైలట్ నియంత్రించడం వీలు కాలేదు. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. 8 మంది ప్రాణాలను కోల్పోయారు.