అల్ఖైదా చీఫ్ బతికే ఉన్నాడు-వీడియో సందేశంతో ప్రత్యక్షం : మరణించినట్లుగా ప్రచారం..ఇప్పుడిలా..!!
ఆల్
ఖైదా
చీఫ్
బతికే
ఉన్నాడా.
ఆయన
మరణించాడనే
వార్తల్లో
నిజం
లేదా.
అదంతా
ప్రచారమేనా.
ఇప్పుడు
తాజాగా
వస్తున్న
వీడియోలు..ఆధారాలు
అవననే
చెబుతున్నారు.
చాలా
కాలం
క్రితమే
చనిపోయాడనుకున్న
అల్ఖైదా
చీఫ్
అయ్మాన్
అల్-జవహిరి
బతికే
ఉన్నాడు.
తాజాగా
9/11
దాడి
జరిగి
20
ఏళ్ల
పూర్తయిన
సందర్భంగా
అతడు
ఓ
వీడియో
సందేశాన్ని
రిలీజ్
చేశాడు.
అల్ఖైదా
అధికారిక
మీడియా
అస్-సహబ్
ఈ
60
నిమిషాల
వీడియోను
పోస్ట్
చేసింది.
ఒసామా బిన్ లాడెన్ను అమెరికా మట్టుబెట్టిన తర్వాత అల్ఖైదా బాధ్యతలు తీసుకున్న జవహిరి.. చాలాకాలంగా అండర్గ్రౌండ్లోనే ఉన్నాడు. గతేడాది నవంబర్లో అతడు అనారోగ్యంతో మరణించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అతని నుంచి వీడియో బయటకు రావడంతో ఇప్పుడు అందరూ అవాక్కవుతున్నారు. శనివారం విడుదలైన ఈ వీడియోలో జవహిరి పూర్తి ఆరోగ్యంతో కనిపించాడు.
సెప్టెంబర్ 11 ఉదయం నుంచీ కొన్ని టెలిగ్రామ్ చానెళ్లలో ఈ వీడియో వస్తోందంటూ అస్-సహబ్ ప్రోమోలు నడిపించింది. ఆ తర్వాత ఓ టెలిగ్రామ్ చానెల్ ద్వారానే జవహిరి రాసిన 852 పేజీల బుక్ను రిలీజ్ చేసింది అల్ఖైదా. ఈ 60 నిమిషాల వీడియోలో ఒక్కచోట మాత్రమే అతడు ఆఫ్ఘనిస్థాన్ గురించి ప్రస్తావించాడు.
20 ఏళ్ల యుద్ధం తర్వాత అమెరికా పూర్తిగా కుంగిపోయి మళ్లీ ఇంటిదారి పట్టిందని అన్నాడు. 9/11 దాడుల్లో పాల్గొన్న 19 మంది అల్ఖైదా ఉగ్రవాదులను అతడు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. అదే విధంగా సెప్టెంబర్ 11 దాడులకు 20 ఏళ్లు పూర్తి కావటంలో ఆప్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ భవనం పైన తాలిబన్లు తమ జెండా ఎగురవేసారు.
వాస్తవంగా ఇదే రోజున తమ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావించినా..చివరి నిమిషంలో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇక, తాజా వీడియోలో జవహరితో పాటుగా చాలా మంది జీహాది ఫైటర్లు కనిపించారు.