సముద్రంలో ముక్కలైన నౌక: 400 మంది మృతి!
రోమ్: లిబియా నుండి ఇటలీ వెళ్తున్న ఓ నౌక మధ్యదరా సముద్రంలో మార్గమధ్యంలో ముక్కలైంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న నాలుగు వందల మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది లిబియా నుండి వలసవాదులతో ఆ నౌక వెల్తోంది. నౌక నుండి వేరొక చిన్న పడవలో బయటపడ్డ కొందరు వ్యక్తులు ఇటలీ నౌకాశ్రయానికి చేరుకున్నారు.

ఈ నౌకలో దాదాపు 550 మంది ప్రయాణిస్తున్నారు. లిబియా నుండి బయలుదేరిన 24 గంటల తర్వాత ఈ ప్రమాదం జరిగింది. ఇందులో 150 మందిని రక్షించారు. వారిని సదర్న్ ఇటాలియన్ పోర్ట్కు మంగళవారం ఉదయం తీసుకు వచ్చారు. ఈ విషయాన్ని సేవ్ ది చిల్డ్రన్ అనే సంస్థ తెలిపింది.
గతంలో అంటే 2014లో ఇలాంటి ప్రమాదంలోనే 500 మంది మృతి చెందారు. తాజా ప్రమాదంలో రక్షించబడిన 150 మందిలో ఎక్కువ మంది సబ్ సహరన్ ఆఫ్రికన్స్. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని సేవ్ ది చిల్డ్రన్ ప్రతినిధులు చెప్పారు.












Click it and Unblock the Notifications