Attack On Houthi Rebels: హౌతీ తిరుగుబాటుదారులపై క్షిపణి దాడులు..
ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ షిప్పింగ్ను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్-సమాఖ్య హౌతీ తిరుగుబాటుదారులపై యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ దాడులు కొనసాగిస్తోంది. అమెరికా, బ్రిటన్ వరుస దాడులతో యెమెన్పై విరుచుకుపడుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున తొలిసారి ప్రతీకార దాడులు కొనసాగుతోన్నాయి. యెమెన్లో ఈ సాయుధ ముఠాకు సంబంధించిన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని క్షిపణి దాడులు చేశారు.
పాలస్తీనా గ్రూప్ హమాస్కు మద్దతిచ్చే హౌతీలు శుక్రవారం నాటి దాడులను "అనాగరికం" అని పేర్కొన్నారు. తిరుగుబాటుదారులు రాజధాని సనాతో సహా యెమెన్లోని చాలా భాగాలను నియంత్రిస్తున్నారు. ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్తో వాణిజ్యం కొనసాగిస్తున్న నౌకలను లక్ష్యంగా చేసుకోవడం కొనసాగిస్తామని హెచ్చరించారు. యూఎస్, బ్రిటీష్ దాడులను ఖండించారు.

పాలస్తీనియన్లకు తమ మద్దతును ఉంటుందని యెమెన్లు చెప్పారు. ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులతో యెమెన్ను వివాదంలోకి లాగడానికి తిరుగుబాటుదారులు బాధ్యత వహిస్తారని సౌదీ ఆరేబియా పేర్కొంది. "ఈ దాడులు యెమెన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు స్పష్టమైన ఉల్లంఘన మరియు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే" అని ఆ దేశ మంత్రిత్వ శాఖ ప్రతినిధి నాసర్ కనానీ అన్నారు.
టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ దాడులను ఖండించారు. అమెరికా, బ్రిటన్ ఎర్ర సముద్రాన్ని రక్త సముద్రంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. "గాజాపై ఇజ్రాయెల్ దురాక్రమణ, పాలస్తీనా ప్రజలపై యుద్ధ నేరాలకు పాల్పడటం, అంతర్జాతీయ చట్టాన్ని శిక్షార్హతతో ఉల్లంఘించడం ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలకు కారణం" అని జోర్డాన్ విదేశాంగ మంత్రి ఐమన్ సఫాది చెప్పారు.












Click it and Unblock the Notifications