కిమ్కు షాక్: నార్త్ కొరియాపై బాంబు దాడి, సూపర్ బాంబు, బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు
వాషింగ్టన్: అణు పరీక్షలు, క్షిపణుల ప్రయోగంతో ప్రత్యర్థి దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్కు అమెరికా చుక్కలు చూపించింది. ఇక మాటల్లేవ్ అంటూ ప్రకటించిన వెంటనే అమెరికా చేతల్లోకి దిగింది.సూపర్ బాంబును అమెరికా పరీక్షించింది.
తన చర్యలతో ప్రత్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది ఉత్తరకొరియా. అమెరికా పలు మార్లు హెచ్చరికలు జారీ చేసినా కానీ, ఆ హెచ్చరికలను మాత్రం ఉత్తరకొరియా పట్టించుకోలేదు.
రెండు రోజుల క్రితం ఖండాంతర క్షిపణిని కూడ ఉత్తరకొరియా పరీక్షించింది. జపాన్కు సమీపంలో ఈ క్షిపణి లభ్యమైంది. అయితే ఈ క్షిపణి ప్రయోగంతో జపాన్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని జపాన్ ఆదేశాలను జారీ చేసింది.
అయితే దక్షిణ కోరియా ఉత్తర కొరియా చర్యలకు అడ్డుపడేందుకు సిద్దమైంది. ఉత్తరకొరియా సరిహద్దుల్లో బాంబు దాడులకు పాల్పడింది దక్షిణ కొరియా.ఉత్తరకొరియా వ్యవహరశైలిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. ఉత్తరకొరియాకు తగిన బుద్ది చెప్పాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు.

సూపర్ బాంబును పరీక్షించిన అమెరికా
ఉత్తర కొరియాకు చెక్ చెప్పేందుకు అమెరికా ప్రయత్నాలను ప్రారంభించింది. ఐక్యరాజ్యసమితి సహ పలు దేశాలు హెచ్చరిస్తోన్న ఉత్తరకొరియా మాత్రం మొండిగా వ్యవహరిస్తోంది. దీంతో ఉత్తరకొరియాకు చెక్ పెట్టేందుకు అమెరికా రంగంలోకి దిగింది. న్యూక్లియర్ సూపర్ బాంబును పరీక్షించింది అమెరికా. ఇక మాటలతో పని కాదు ... చేతల్లోకి దిగాలని ట్వీట్ చేసిన ట్రంప్ వెంటనే ఈ బాంబును పరీక్షించారు.

బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన అమెరికా
ఉత్తరకొరియాను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్టు అమెరికా కూడ సంకేతాలను పంపింది. అమెరికా నేవీ హవాయిలో బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. బీ 61-12 బాంబును కిమ్ దేశాన్ని అడ్డుకొనేందుకు ఉపయోగపడుతోందని ఫసిఫిక్ మిస్సెల్ రేంజ్ ఫెసిలిటీ ప్రకటించింది.

ఉత్తరకొరియాపై బాంబుదాడులు
జపాన్ మీదుగా పసిఫిక్ సముద్రంలోకి క్షిపణిని ప్రయోగించడంతో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్పై అమెరికా, మిత్రదేశాలైన జపాన్, దక్షిణకొరియా తీవ్రఆగ్రహంగా ఉన్నాయి. దీంతో కిమ్ జాంగ్ ఉన్ను భయపెట్టాలని భావించిన అమెరికా గురువారం ఓ దుందుడుకు చర్యకు పాల్పడింది. దక్షిణకొరియాలో సైనిక విన్యాసాలను జరుపుతున్న తమ యుద్ధవిమానాల సహాయంతో ఉత్తరకొరియా సరిహద్దుకు సమీపంలో బాంబులను విసిరింది.

తీవ్రంగా స్పందించిన కిమ్
తమ సరిహద్దుకు సమీపంలో దక్షిణకొరియాలో బాంబులను విసరడం పట్ల ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గురువారం స్పందించారు. ‘అనాగరిక చర్య'గా కిమ్ అభివర్ణించారు. ఉత్తరకొరియా ఒక్క క్షిపణిని ప్రయోగిస్తే చాలు వెంటనే వెనక్కి వెళ్లిపోతారని కిమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలావుండగా దక్షిణకొరియాలోని ఉత్తరకొరియా సరిహద్దుకు సమీపంలో యూఎస్ బాంబర్లు, యుద్ధ విమానాలను అమెరికా మోహరించించడం పట్ల కిమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications