అమెరికాలో మరో దారుణం... తొలి ముస్లిం మహిళా న్యాయమూర్తి దారుణ హత్య!
అమెరికాలో తొలి ముస్లిం మహిళా న్యాయమూర్తిగా ఎన్నికై రికార్డు సృష్టించిన షీలా అబ్దుస్ సలామ్ హడ్సన్ నదిలో విగత జీవిగా కనిపించడం కలకలం రేపింది.
న్యూయార్క్ అమెరికాలో మరో దారుణం జరిగింది. దేశంలో తొలి ముస్లిం మహిళా న్యాయమూర్తిగా ఎన్నికై రికార్డు సృష్టించిన షీలా అబ్దుస్ సలామ్ (65) హడ్సన్ నదిలో విగత జీవిగా కనిపించడం కలకలం రేపింది.
న్యూయార్క్ స్టేట్ అత్యున్నత న్యాయస్థానంలో అసోసియేట్ జడ్జిగా ఉన్న ఆమె హర్లీమ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. నదిలో ఎవరిదో మృతదేహం తేలియాడుతోందని న్యూయార్క్ పోలీసులకు సమాచారం అందింది.
ఆ సమాచారంపై స్పందించిన న్యూయార్క్ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి, ఆమె మహిళా న్యాయమూర్తి అబ్దుస్ సలామ్ అని గుర్తించారు. అయితే ఆమెపై దాడి జరిగిన ఆనవాళ్లు లేవని, ధరించిన బట్టలు కూడా చెరగలేదని వారు పేర్కొన్నారు.
2013 నుంచి న్యాయమూర్తిగా ఉన్న ఆమె, అంతకుముందు 15 సంవత్సరాలు మన్ హటన్ కోర్టులో ఫస్ట్ అపిలేట్ డివిజన్ లో సేవలందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న న్యూయార్క్ పోలీసులు విచారణ జరుపుతున్నామని తెలిపారు.