Myanmar Earthquake: మయన్మార్ లో మళ్ళీ భూప్రకంపనలు-భారత్ నుంచి ఎన్డీఆర్ఎఫ్..!
మయన్మార్ ను భూకంపాలు వదలడం లేదు. నిన్న ఏకంగా 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపానికి భారీగా ఆస్తినష్టం, ప్రాణనష్టం కూడా వాటిల్లాయి. ఇంకా భవనాల కింద వందల సంఖ్యలో జనం చిక్కుకుని ఉన్నారు. దీని నుంచి కోలుకోకముందే ఇవాళ మళ్లీ భూప్రకంపనలు వచ్చాయి. 4.7 తీవ్రతతో వచ్చిన ఈ ప్రకంపనలకు జనం మళ్లీ పరుగులు తీశారు. నిన్నటి విషాదం నుంచి బయటపడకముందే మళ్లీ ప్రకంపనలు రావడంతో మయన్మార్ వాసులు ప్రాణాలు అరచేత్తో పట్టుకుని బతుకుతున్నారు.
మయన్మార్ లో నిన్నటి భూకంపానికి చనిపోయిన వారి సంఖ్య వెయ్యి దాటిపోయింది. రెండున్నర వేలకు మందికి పైగా తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఇంకా 30 మంది కనిపించకుండా పోయారు. వీరిని రక్షించేందుకు భారత్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయలుదేరి వెళ్లాయి. అలాగే మయన్మార్ కు మానవతా సాయం కింద ఆపరేషన్ బ్రహ్మ పేరుతో కేంద్రం సాయం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఐఎన్ఎస్ సాత్పురా, ఐఎన్ఎస్ సావిత్రి నౌకల్లో 40 టన్నుల ఆహారపదార్ధాలు, ఇతర సాయాన్ని పంపినట్లు విదేశాంగమంత్రి జై శంకర్ ట్వీట్ చేశారు.

#OperationBrahma @indiannavy ships INS Satpura & INS Savitri are carrying 40 tonnes of humanitarian aid and headed for the port of Yangon.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) March 29, 2025
🇮🇳 🇲🇲 pic.twitter.com/MJcG9Dbgnj
భారత్ తో పాటు పలు దేశాలు భూకంపంతో దెబ్బతిన్న మయన్మార్ కు సాయం పంపుతున్నాయి. అలాగే క్షేత్రస్ధాయిలో సహాయక చర్యలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇవాళ వచ్చిన ప్రకంపనలు వీటిపై ప్రభావం చూపాయి. ప్రకంపనల భయంతో సహాయక సిబ్బంది చర్యల్ని తాత్కాలికంగా నిలిపేసినట్లు తెలుస్తోంది. అయితే ఇంత పెద్ద భూకంపం తర్వాత ఇలాంటి ప్రకంపనలు సహజమేనని నిపుణులు చెప్తున్నారు. అయినా నిన్నటి భూకంపం భయానికి జనంలో వణుకు మాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications