ఘోర ప్రమాదం: గ్యాస్ ట్యాంకర్ పేలి 35 మంది మృతి, 100 మందికి గాయాలు
అబుజా: నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 35 మంది వరకు మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. గ్యాస్ టాంకర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరగగానే ఎమర్జెన్సీ బృందం సెమా సహాయక చర్యలు చేపట్టింది.
అబుజాలోని లాఫియా మాకర్ది రహదారి పెట్రోల్ స్టేషన్ వద్ద గ్యాస్ ట్యాంకర్ ఒక్కసారిగా పేలిందని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై అక్కడి వారు మాట్లాడుతూ... ట్యాంకర్లో నుంచి పెట్రోల్ స్టేషన్ సిబ్బంది గ్యాస్ తీసుకుంటున్న సమయంలో పేలుడు సంభవించిందన్నారు. ఈ ఘటనపై దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ ప్రమాదంలో గాయాలపాలైన వారిని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటన భయంకరమైన విషాదమని నైజీరియా సెనేట్ ప్రెసిడెంట్ అన్నారు. గాయాలపాలైన వారిని తాను పరామర్శించానని చెప్పారు.
కాగా నైజీరియాలో ఇటువంటి ప్రమాద ఘటనలు తరుచూ చోటు చేసుకుంటున్నాయి. అక్కడి రోడ్లు సరిగ్గా లేకపోవడం, భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications