ఆప్ఘనిస్తాన్లో బాంబ్ పేలుళ్లు : ఆరుగురి మృతి, 23 మందికి గాయాలు
కాబుల్ : బాంబు పేలుళ్లతో ఆఫ్ఘనిస్తాన్ దద్దరిల్లింది. పర్షియన్ కొత్త సంవత్సర పండుగ రోజు దుండగులు మోర్టార్ షెల్స్, రాకెట్ లాంఛర్లతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందినట్టు ఆప్ఘనిస్థాన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
పేలుళ్లతో దద్దరిళ్లిన కాబుల్
పర్షియా కొత్త సంవత్సర వేడుకును గురువారం కాబుల్లో జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో కర్తె -ఈ మసీదు వద్ద పేలుళ్లకు పాల్పడ్డారు. ప్రార్థన చేసేందుకు వచ్చిన ఆరుగురు చనిపోయారు. మరో 23 మంది గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పేలుడు జరిపిన ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.

కారణమిదేనా ?
పర్షియా కొత్త సంవత్సర వేడుకును షియా ముస్లింలు జరుపుకుంటారు. కానీ ఇది ముస్లింల సాంప్రదాయానికి విభిన్న ఇతరుల వాదాన. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రార్థనలు చేసుకుంటారు. ఈ క్రమంలో కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. న్యూ ఇయర్ వేడుకలను వ్యతిరేకిస్తూనే దాడులు చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications