సెల్ఫీ ఫోటో: నదిలో పడి యువకుడి దుర్మరణం
లండన్: సెల్ఫీ పోటోలు తీసుకుంటున్న సమయంలో యువత ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో సెల్ఫీ ఫోటోలు తీసుకుంటు ప్రమాదాలకు గురికావడం, ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతున్న పలు సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.
సింగపూర్ లో నివాసం ఉంటున్న మొహమ్మద్ అస్లాం సాహు (21) అనే వ్యక్తి శనివారం స్నేహితులతో కలిసి ఇండోనేషియాలోని లూసా నింబోన్ గ్యాన్ ఏరియాకు విహారయాత్రకు వెళ్లారు. ఆ సందర్బంలో అస్లాం స్నేహితులతో కలిసి ఫోటోలు తీసుకుంటున్నాడు.

తరువాత అస్లాం ఒక్కడే బాలి నది ఒడ్డున నిలబడి సెల్ఫీ తీసుకుంటున్నాడు. ఆ సందర్బంలో అతను కాలు జారీ నదిలో పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. విషయం గుర్తించిన సాటి స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు.
శుక్రవారం మాస్కోలో 21 సంవత్సరాల యువతి హ్యాండ్ గన్ (పిస్తోల్) తీసుకుని సెల్ఫీ ఫోజు ఇచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకునింది. అనేక చోట్ల సెల్ఫీ ఫోటోలు తీసుకుంటు ప్రమాదాలకు గురై కాళ్లు, చేతులు పోగొట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. కొన్ని సందర్బాలలో సెల్ఫీల జోలికి వెల్లకుండ ఉంటే చాల మంచిది.












Click it and Unblock the Notifications