బంగ్లాదేశ్లో.. ‘న్యాయదేవత’నే లేపేశారు! ప్రధాని కూడా ఒక స్త్రీ.. అయినా...
బంగ్లాదేశ్ను ఓ లౌకికవాద దేశంగా స్ఫురింపచేస్తూ ఆ దేశ సుప్రీంకోర్టు ఆవరణలో ఆవిష్కృతమైన వివాదాస్పదమైన ‘న్యాయ దేవత’ విగ్రహాన్ని శుక్రవారం తొలగించారు. ఈ వివాదాస్పద విగ్రహాన్ని తొలగించాలని కొన్ని వర్గాల ప
బంగ్లాదేశ్ను ఓ లౌకికవాద దేశంగా స్ఫురింపచేస్తూ ఆ దేశ సుప్రీంకోర్టు ఆవరణలో ఆవిష్కృతమైన వివాదాస్పదమైన 'న్యాయ దేవత' విగ్రహాన్ని శుక్రవారం తొలగించారు. ఎడమ చేతిలో త్రాసు, కుడిచేతిలో కరవాలం పట్టుకున్న ఈ విగ్రహం గ్రీకు న్యాయదేవత 'థేమిస్'ను తలపింప చేస్తున్నా, గ్రీకు దుస్తులకు బదులు బెంగాలీ చీరకట్టు కలిగి ఉంటుంది.
గత డిసెంబర్లో ఏర్పాటు చేసిన ఈ వివాదాస్పద విగ్రహాన్ని తొలగించాలని కొన్ని వర్గాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఇటీవల అది ఉధృతమవడంతో దాన్ని సుప్రీంకోర్టు ఆవరణ నుంచి తొలగించి అంతగా ప్రాధాన్యతలేని మారుమూల ప్రాంతంలో ఎక్కడైనా ఏర్పాటు చేయాలంటూ సాక్షాత్తు దేశ ప్రధాని షేక్ హసీనా.. ప్రధాన న్యాయమూర్తి సురేంద్ర కుమార్ సిన్హాకు సూచించారు.

శిల్పి సమక్షంలోనే తొలగింపు...
ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఆ విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి మృణాల్ హక్ సమక్షంలో సుప్రీం కోర్టు ఆవరణ నుంచి ఆ విగ్రహాన్ని తొలగించారు. మదర్సా టీచర్లు, విద్యార్థులతో కూడిన సంఘం హెఫాజత్ ఏ ఇస్లామ్, అవామీ ఒలేమా లీగ్, ఇస్లామీ ఆందోళన్ బంగ్లాదేశ్ బృందాలు విగ్రహానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ వచ్చాయి. ఇస్లాం సంప్రదాయం ప్రకారం విగ్రహారాధన ఉండకూడదు కనుక తాము విగ్రహాన్ని తొలగించాలంటున్నామని ఈ ఆందోళన గ్రూపులు తెలిపాయి.

అది బెంగాలీ మహిళ చీరకట్టు...
గ్రీకు దేవతా విగ్రహాన్ని బంగ్లాదేశ్లో ఎందుకు పెట్టారని దేశ ప్రధాని షేక్ హసీనా ఆది నుంచీ ప్రశ్నించడం లౌకికవాదులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. లౌకికవాదులు విగ్రహాన్ని తొలగించవద్దంటూ ఈ రోజు కూడా ఆందోళన చేశారు. గ్రీకు న్యాయదేవతతో భంగిమలో పోలిక ఉన్నా తాను చీరకట్టులో బెంగాలీ మహిళ ప్రతిబింబించేలా విగ్రహాన్ని తయారు చేశానని ఆ విగ్రహాన్ని రూపొందించిన మృణాల్ హక్ ఈ రోజు కూడా తన వాదనను సమర్థించుకున్నారు.

ఆయన కూతురేనా.. ఈమె?
బంగ్లాదేశ్ వ్యవస్థాపక నాయకుడు ముజిబూర్ రెహమాన్ కూతురైన షేక్ హసీనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని తాము ఊహించలేదని దేశంలోని లౌకికవాదులు అంటున్నారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే షేక్ హసీనా ఈ నిర్ణయం తీసుకున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న సంప్రదాయవాదుల ఓట్లను ఆకర్షించడమే ఆమె లక్ష్యమని సీనియర్ పాత్రికేయులు వ్యాఖ్యానిస్తున్నారు.

తొలగింపు.. చేర్పు.. మళ్లీ..
1071లో బంగ్లాదేశ్ ఆవిర్భవించినప్పుడు భారత్ను స్ఫూర్తిగా తీసుకొని రాజ్యాంగంలో తొలిసారిగా ‘లౌకికవాద దేశంగా' పేర్కొన్నారు. ఆ తర్వాత 1977లో దీన్ని మళ్లీ రాజ్యాంగం నుంచి తొలగించారు. లౌకికవాదులు గొడవ చేయడంతో తిరిగి 2010లో మళ్లీ చేర్చారు. ఇప్పుడు లౌకికవాదుల సంఖ్య దేశంలో గణనీయంగా తగ్గుతూ వస్తోంది.

తొలగించే వరకూ ఆందోళన...
ఓ విగ్రహాన్ని తొలగించాలంటూ ఆందోళన చేయడం దేశంలో ఇదే మొదటిసారి కాదు. 2008లో బెంగాలీ జానపద గాయకుడు లాలన్ ఫకీర్కు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేయడంతో దాన్ని తొలగించారు. ఇప్పుడు ఆందోళన చేయడంతో ఏకంగా న్యాయ దేవతా విగ్రహాన్నే తొలగించారు. మున్ముందు బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం విరోచితంగా పోరాడిన అమరుల విగ్రహాలను కూడా తొలగిస్తారేమో అని లౌకికవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇలాగే ఉపేక్షిస్తే...
ఇలాగే ఉపేక్షిస్తే రాజ్యాంగం నుంచి లౌకికవాద పదాన్ని శాశ్వతంగా తొలగించే ప్రమాదం ఉందని కూడా వారు హెచ్చరించారు. ఇప్పటికే బంగ్లాదేశ్ సంప్రదాయవాదులు‘ముక్తో మోనా' సంప్రదాయానికి విరుద్ధంగా రచయితలపై భౌతికదాడులు జరుపుతున్నారు. ఇక్కడ ముక్తో మోనా అంటే భావ ప్రకటనా స్వాతంత్య్రాన్ని గౌరవించడం.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications