వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: యువతిని స్థంభానికి కట్టి చితకబాదారు, ఎందుకో తెలుసా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహర్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకొంది. యువకుడిని ప్రేమించిందనే కోపంతో ఓ యువతిని కుటుంబసభ్యులు ఇంటి స్థంభానికి కట్టేసి చితకబాదారు. ఆ దెబ్బలు తాళలేక ఆ యువతి కన్నీరు మున్నీరుగా విలపిస్తోన్న ఆ యువతిని వదిలిపెట్టలేదు.ఈ ఘటన గురించి తెలుసుకొన్న పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.

బీహర్ రాష్ట్రంలోని పశ్చిమ చంపారన్ జిల్లాలోని బగహలో దారుణం చోటు చేసుకొంది. గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించిందనే అక్కసుతో యువతిని స్థంబానికి కట్టేసి చితకబాదారు నిందితులు .

Bihar: Four arrested for thrashing a girl after tying her with pillar in Bagaha

అయితే ఈ విషయమై యువతిని చితకబాదుతోంటే స్థానికులు ఈ తతంగాన్ని ప్రేక్షకుల మాదిరిగా నిలబడి చూశారు. అయితే ఓ మహిళ ఆ యువతిని కొట్టకుండా ఆపేందుకు ప్రయత్నించింది.

ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బాధితురాలిని రక్షించారు. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో వైపు బాలికపై దాడికి పాల్పడిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

English summary
Police in West Chamaparan arrested four accused on Friday night who were allegedly involved in thrashing a girl after tying her with a pillar using ropes. The matter surfaced after the video of the incident surfaced on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X