క్వెట్టా మసీదులో దాడి : ఇద్దరి మృతి, 14 మందికి గాయాలు
క్వెట్టా : శుక్రవారం ప్రార్థనలు చేస్తుండగా రెచ్చిపోయారు. పాకిస్థాన్లోని క్వెట్టాలో పేలుళ్లకు పాల్పడ్డారు. మసీదు వద్ద శక్తిమంతమైన బాంబు పేల్చడంతో ఇద్దరు గాయపడ్డారు. మరో 14 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
దాడికి తెగబడ్డ ముష్కరులు
బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాలో ముష్కరులు దాడితో భయాందోళనకు గురిచేశారు. ఇక్కడ వేర్పాటువాదం కోసం ఆందోళనలు జరుగతున్నాయి. వారు మౌలిక వసతుల సదుపాయాల సంస్థలు, భద్రతా దళాలపై దాడులకు తెగబడుతారు. ఇవాళ మసీదులపై దాడికి తెగబడ్డారు. ఇక్కడ సున్నీ ముస్లిం ఉగ్రవాదులు కూడా దాడులకు తెగబడుతుంటారు. ప్రభుత్వ సంస్థల లక్ష్యంగా, షియా ముస్లింలు ఉన్న చోట దాడికి పాల్పడుతుంటారు. కానీ సున్నీ మసీదులపై అటాక్ చేయడం అరుదని .. ఈ ఘటనపై విచారణ జరిపిస్తున్నామని పోలసులు చెప్తున్నారు.

ఉగ్రవాదులపై ఉక్కుపాదం
ఈ నెల 16న పాకిస్థాన్ సెక్యూరిటీ దళాలు ఐఎస్ ఉగ్రవాదులపై దాడికి తెగబడ్డారు. దీంతో 9 మంది ఉగ్రవాదులు చనిపోయారు. ఇక్కడ జిహదీల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో భద్రతాదళాలు అప్రమత్తమై కాల్పులు జరిపాయి. నలుగురు ఉగ్రవాదులను కూడా గుర్తించాయి.












Click it and Unblock the Notifications