అమెరికా మటాషే! అణుదాడికంటే ప్రమాదకరమైన టెక్నాలజీని ప్రయోగించబోతోన్న ఉత్తరకొరియా!?
అణుదాడి జరుపుతామంటూ ఇన్నాళ్లూ అగ్రరాజ్యం అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఉత్తరకొరియా తాజాగా తన వ్యూహాన్ని మార్చింది. అణుదాడిని మించిన దాడి జరపబోతోందట.
వాషింగ్టన్: అణుదాడి జరుపుతామంటూ ఇన్నాళ్లూ అగ్రరాజ్యం అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఉత్తరకొరియా తాజాగా తన వ్యూహాన్ని మార్చింది. అణుదాడిని మించిన దాడి జరపబోతోందట.
Recommended Video

అమెరికాను టార్గెట్ చేసుకుని ఉత్తరకొరియా ఎలక్ట్రో మాగ్నిటిక్ పవర్ను ప్రయోగించబోతోందని అమెరికా మీడియా తెలిపింది. ఈఎమ్పీగా పిలిచే ఆ టెక్నాలజీ వల్ల అన్ని ఎలక్ట్రిక్ సర్క్యూట్లు పని చేయకుండాపోతాయని మీడియా పేర్కొంది.

ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఎలక్ట్రిక్ వ్యవస్థపై ఆధారపడి పని చేస్తోందని, ఆ వ్యవస్థను నాశనం చేయడం వల్ల అమెరికా భారీ స్థాయిలో దెబ్బతింటుందని అమెరికా మీడియా హెచ్చరిస్తోంది.
అణుదాడి వల్ల కేవలం 90 శాతం మంది అమెరికా ప్రజలకు మాత్రమే ముప్పు ఏర్పడుతుందట. అదే ఈఎమ్పీ ప్రయోగం ద్వారా అయితే అమెరికాకు అంతకంటే ఎక్కువ నష్టం జరుగుతుందట.
అందుకే ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఎలక్ట్రో మాగ్నిటిక్ పవర్ ప్రయోగానికే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం జరిపినప్పుడల్లా గగ్గోలు పెట్టే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరి ఇప్పుడేం చేస్తారో?












Click it and Unblock the Notifications