అమెరికాలో వరద బీభత్సం.. ఆగని మృతుల సంఖ్య.. గల్లంతైన వారికోసం గాలింపు..
అమెరికాలోని టెక్సాస్ లో వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 67 మంది మృతిచెందినట్లు సమాచారం. ఇప్పటికే ఈ వరదల్లో చిక్కుకుని 27 మంది బాలికలు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. సమ్మర్ క్యాంప్ కు వచ్చిన 15 మంది చిన్నారులు మరణించగా.. మరో 27 మంది బాలికలు వరద ప్రవాహంలో గల్లంతైనట్లు ఈమేరకు అధికారులు వెల్లడించారు. గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.
గత కొన్నిరోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు అమెరికాలోని టెక్సాస్ నగరం అల్లకల్లోలంగా మారింది. కెర్ కౌంటీలోని గ్వాడలుపే నది నీటి ఉద్ధృతికి ఉప్పొంగింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఈ క్రమంలో నదీ ఒడ్డున సమ్మర్ క్యాంపులు కొట్టుకుపోయాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 67 మంది మృతిచెందినట్లు సమాచారం. ఈ వరదల్లో చిక్కుకుని 27 మంది బాలికలు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. సమ్మర్ క్యాంప్ కు వచ్చిన 15 మంది చిన్నారులు మరణించనట్లు పేర్కొన్నారు.

వరదల కారణంగా ఇప్పటివరకు 67 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. కెర్ కౌంటీలో 59 మంది మృతి చెందగా.. ట్రావిస్ కౌంటీలో 4, బర్నెట్ కౌంటీలో 3, కెండాల్ కౌంటీలో ఒకరు చొప్పున మరణించారని అధికారులు తెలిపారు. వరద ఉద్ధృతి ఒక్కసారిగా పెరగడంతోనే మృతుల సంఖ్య పెరిగనట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాక అనేక నివాసాలు నీట మునిగి వీధుల్లోకి భారీగా వరద నీరు చేరిందని తెలిపారు. పలు వాహనాలు కొట్టుకుపోయినట్లు వెల్లడించారు. సహాయక చర్యల్లో భాగంగా ఇప్పటివరకు వరదల్లో చిక్కుకున్న 850 మందిని రక్షించినట్లు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.
Death toll from Texas floods reaches 59, including 21 children
— Simo Saadi🇺🇸🇲🇦 (@Simo7809957085) July 6, 2025
Officials said more than 850 people had been rescued, including some clinging to trees, after a sudden storm dumped more than a foot of rain in an area around the Guadalupe River. pic.twitter.com/2ZnFSjsiza
మృతుల కుటుంబాలకు పోప్ లియో సంతాపం తెలిపారు. హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిష్టి నోయిమ్, టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ ఆబ్బోట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని వివరించారు. టెక్సాస్ వరదలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్ట్ బ్రోకెన్ అని తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
Death toll rises to 59 after catastrophic Texas flood
— CHItrader (@CHItraders) July 6, 2025
🔹 Torrential rains dumped up to 12 inches in Kerr County on July 4
🔹 Camp Mystic, hosting 750 girls, was overwhelmed by floodwaters
🔹 Gov. Greg Abbott signed a federal disaster declaration for 21 counties
🔹…
మరోవైపు టెక్సాస్ వరదలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications