డోక్లాం వివాదం: భారత్లోని చైనీయులకు ఆ దేశం హెచ్చరికలు
డోక్లాం వివాదం నేపథ్యంలో భారత్, చైనాల మధ్య గత రెండు నెలలుగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో మరోసారి భారతదేశంలోని చైనాయులను ఆ దేశం మరోసారి హెచ్చరించింది.
బీజింగ్/న్యూఢిల్లీ: డోక్లాం వివాదం నేపథ్యంలో భారత్, చైనాల మధ్య గత రెండు నెలలుగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో మరోసారి భారతదేశంలోని చైనాయులను ఆ దేశం మరోసారి హెచ్చరించింది. ఈ మేరకు ఢిల్లీలోని చైనా ఎంబసీ నుంచి ఈ అడ్వైజరీ జారీ చేశారు. డోక్లాం ఉద్రిక్తత నేపథ్యంలో చైనా ఇలా హెచ్చరికలు జారీ చేయడం రెండోసారి కావడం గమనార్హం.
అంతకుముందు నెలరోజులపాటు అంటే ఆగస్టు 7వరకూ ఈ అడ్వైజరీ వర్తిస్తుందని పేర్కొంది. జులై 8 తర్వాత తాజాగా గురువారం మరోసారి హెచ్చరికలను జారీ చేసింది.డిసెంబర్ 31 వరకు ఈ అడ్వైజరీ వర్తించనుందని చైనా ఎంబసీ తెలిపింది. ఈ అడ్వైజరీ ప్రకారం.. చైనా ప్రజలు భారత్లో అనవసర ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచించింది.

అంతేగాక, 'భారత్లో ప్రకృతి విపత్తులు, రోడ్డు ప్రమాదాలు, రోగాలు తరచుగా ఉంటాయి. వీటితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగత భద్రతను పెంపొందించుకోవాలి. స్థానిక మతాచారాలు, సంప్రదాయాలకు గౌరవం ఇవ్వండి' అని పేర్కొంది. డోక్లాం వివాదం నేపథ్యంలో చైనా తన ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకు ఈ అడ్వైజరీలు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
చైనా యుద్ధానికి సిద్ధమంటూ ఇప్పటిక పలుమార్లు భారత్ను హెచ్చరించిన విషయం తెలిసిందే. కాగా, భారత్ కూడా తాము వెనక్కి తగ్గేది లేదని చైనాకు స్పష్టం చేసింది. చైనా పలుమార్లు సరిహద్దు ప్రాంతంలో యుద్ధ విన్యాసాలు కూడా చేసింది. దీంతో భారత్ కూడా సరిహద్దు ప్రాంతంలోకి భారీగా భద్రతా దళాలను తరలించింది. దీంతో గత రెండు నెలల కాలంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
-
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications