సరిహద్దు ఉద్రిక్తతల వేళ జీ జిన్పింగ్ కీలక నిర్ణయం: పీఎల్ఏ కమాండర్కు జనరల్ ర్యాంక్ హోదా
బీజింగ్: వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నలుగురు మిలిటరీ సీనియర్ అధికారులతోపాటు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కమాండర్ వెస్టర్న్ థియేటర్ కమాండ్కు ర్యాంక్ ఆఫ్ జనరల్ హోదా కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
చైనా-భారత్ సరిహద్దులో వివాదాలు జరుగుతున్న సమయంలో చైనా కమాండర్ ఆఫ్ ది పీఎల్ఏ డబ్ల్యూటీసీ జూ కిల్లింగ్ను జనరల్గా ప్రమోట్ చేస్తున్నట్లు జిన్హువా మీడియా వెల్లడించింది. సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఛైర్మన్ జిన్పింగ్ ఈ ప్రకటన చేసినట్లు పేర్కొంది.

ప్రకటనకు సంబంధించిన ఉత్తర్వులపై సంతకాలు చేసినట్లు బీజింగ్ వేదికగా వెల్లడించింది. ఈస్టర్న్ లడఖ్లో ప్రస్తుతం కనిపిస్తున్న ఉద్రిక్తత పరిస్థితుల్లో ఈ పదవులు కట్టబెట్టడం చర్చనీయాంశంగా మారింది. జూన్ 25న ఇరుదేశాల అధికారుల మధ్య 22వ సమావేశం జరిగింది. ఇందులో ఇరుదేశాల సరిహద్దు సమస్యలపైనే మరోసారి చర్చించారు.
ఇరుదేశాల విదేశాంగ మంత్రుల సమక్షంలో జరిగినప్పటికీ ఓ నిర్ణయానికి రాలేకపోయారు. ప్రస్తుతానికి సరిహద్దు వద్ద పహారా కాస్తూనే శాంతి కోసం పనిచేయాలని తీర్మానించుకున్నారు.
Recommended Video
గాల్వాన్ లోయలో చైనా బలగాలు భారత సైనికులపై గత సంవత్సరం దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 20 మంది భారత జవాన్లు అమరులవగా, 40 మందికిపైగా చైనా సైనికులు మృతి చెందారు. ఆ నాటి నుంచి నేటి వరకు సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో చైనా సరిహద్దు వెంబడి బారీగా బలగాలను పెంచుకుంటూ పోతోంది. దీంతో భారత్ కూడా 50వేల మంది సైనికులను సరిహద్దుకు పంపింది. ఈ నేపథ్యంలో తాజా పరిణామం మరింత ఉద్రిక్తతలను పెంచేది ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ి
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications