నేపాల్ సంక్షోభంలోకి చైనా- కమ్యూనిస్టుల రాజీకి యత్నాలు- భారత్కు ఛాన్స్ లేకుండా
నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో సంక్షోభం కారణంగా పార్లమెంటు రద్దయిన నేపథ్యంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. భారత్తో సరిహద్దు సంక్షోభం నేపథ్యంలో నేపాల్ను మన దేశంపైకి ఎగదోసిన చైనా ఇప్పుడు కూడా అదే వైఖరి కొనసాగిస్తోంది. నేపాల్ రాజకీయాల్లో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించే నెపంతో భారత్కు మద్దతుగా నిలిచే ప్రచండను దారికి తెచ్చుకోవాలని చూస్తోంది.

నేపాల్లో పార్లమెంటు రద్దుకు దారి తీసిన రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించే నెపంతో ఖాట్మండులోని చైనా రాయబారి హో యాంకీ ప్రయత్నాలు ప్రారంభించారు. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీకీ, ప్రచండ వర్గానికి మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఓ చివరి ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన తాజాగా ప్రకటించారు. దీంతో కమ్యూనిస్టు దిగ్గజాల మధ్య రాజీ యత్నానికి చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్ధమవుతోంది. అంతకుముందు నేపాల్ అధ్యక్షురాలు బిద్యా దేవీ భండారీతోనూ చైనా రాయబారి సమావేశమయ్యారు.

నేపాల్లో సంక్షోభానికి కారణమైన కమ్యూనిస్టు పార్టీ కీలక నేత పుష్ప కమల్ దహాల్ (ప్రచండ)తోనూ చైనా రాయబారి భేటీ అయ్యారు. నేపాల్లో సంక్షోభం కొనసాగితే అది అంతిమంగా భారత్కు మేలు చేస్తుందని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి భారత్కు మద్దతుగా ఉండే ప్రచండ చైనాకు అనుకూలంగా ఉండే కేపీ శర్మ ఓలీతో ముఖాముఖీ తలపడుతున్నారు. ఇలాంటి తరుణంలో ప్రచండను ఒప్పించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు ఉత్కంఠ రేపుతున్నాయి.
-
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications