చైనాలో కరోనా విజృంభణ: 9 మిలియన్ల జనాభా ఉన్న ఆ నగరం లాక్ డౌన్
చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తొమ్మిది మిలియన్ల జనాభా కలిగిన పారిశ్రామిక నగరంలో లాక్ డాన్ విధించింది. గత కొన్ని వారాలుగా రోజువారీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మంగళవారం 4,000 కంటే ఎక్కువ వైరస్ కేసులను నివేదించింది.చైనా దేశం యొక్క "సున్నా-కోవిడ్" వ్యూహం ప్రస్తుతం ఓమిక్రాన్ వేవ్ను ఎదుర్కొంటోంది.
Recommended Video


షెన్యాంగ్ నగరంలోనూ లాక్ డౌన్
పొరుగున ఉన్న లియోనింగ్ ప్రావిన్స్లోని షెన్యాంగ్ నగరాన్ని సోమవారం చివరిలో లాక్డౌన్ చేయాలని ఆదేశించినందున ఆరోగ్య అధికారులు దేశవ్యాప్తంగా 4,770 కొత్త ఇన్ఫెక్షన్లను నివేదించారు. ఈశాన్య ప్రావిన్స్ జిలిన్లో ఎక్కువ కేసులు నమోదయినట్టుగా సమాచారం. శనివారం రెండు కోవిడ్-19 మరణాలను నివేదించింది. ఇది ఒక సంవత్సరంలో మొదటిది.

జీరో కోవిడ్ విధానాన్ని పాటిస్తున్న డ్రాగన్ కంట్రీ
మరోవైపు చైనాలో జీరో కోవిడ్ విధానానికి స్వస్తి పలకాలని డ్రాగన్ భావిస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ ఆ వార్తలు చైనా ప్రభుత్వం కొట్టిపారేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహమ్మారి కట్టడికి ఇంతవరకు అనుసరిస్తున్న విధానాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని నెమ్మదిగా తరలించాలని సూచించినప్పటికీ సాధ్యం కాదని శుక్రవారం చైనా ప్రభుత్వం తేల్చి చెప్పింది అంతర్జాతీయ విమాన ప్రయాణాలను, బయటి ప్రపంచంతో సంబంధాలను తగ్గించే ప్రయత్నంలో ఉన్నట్టు చైనా జాతీయ ఆరోగ్య మిషన్ ఉప మంత్రి వాంగ్ హెషేంగ్ స్పష్టం చేశారు.

చైనా ఆర్ధిక వ్యవస్థపై మహమ్మారి ప్రభావం
ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవసరాలతో ఆరోగ్య సంక్షోభాన్ని సమతుల్యం చేయడానికి దేశం ప్రయత్నిస్తున్నందున నిరంతర లాక్డౌన్ల వల్ల వృద్ధికి ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. కార్మేకర్ బీఎండబ్ల్యూతో సహా ఫ్యాక్టరీలకు పారిశ్రామిక స్థావరంగా ఉన్న షెన్యాంగ్, మంగళవారం 47 కొత్త కేసులను నివేదించింది. ఎందుకంటే అధికారులు అన్ని హౌసింగ్ కాంపౌండ్లను "క్లోజ్డ్ మేనేజ్మెంట్" కింద ఉంచారు.గత వారం చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ చైనా ఆర్థిక వ్యవస్థపై మహమ్మారి యొక్క "ప్రభావాన్ని తగ్గించాల్సిన" అవసరాన్ని నొక్కిచెప్పారు.

హాంకాంగ్ లోనూ పెరుగుతున్న కరోనా కేసులు.. చైనాలో ఆందోళన
అయితే ప్రస్తుత జీరో-కోవిడ్ విధానాన్ని కొనసాగించాలని అధికారులను కోరారు. ఇదిలా ఉంటే మరోవైపు చైనా అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో 23 వేల మంది భారతీయ విద్యార్థులతో సహా లక్షలాది మంది విదేశీ విద్యార్థుల చదువు పై తీవ్ర ప్రభావం పడింది. అటు హాంకాంగ్ లోను కొత్తగా కేసులు విజృంభిస్తున్న పరిస్థితి ఉంది. ఆస్పత్రులు రోగులతో నిండిపోతున్నాయి. దేశ ప్రజలకు పదేపదే కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తూ, లాక్ డౌన్ విధించి కరోనా ను కంట్రోల్ చేయడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తోంది చైనా.












Click it and Unblock the Notifications